Loan Apps Harassments: లోన్ యాప్ల వేధింపులు.. యువతి బలవన్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పు చేయాలి. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం, ఆ తర్వాత వాటిని చెల్లించడం చేసేవారు. అయితే, బ్యాంకుల్లో అప్పులకు వడ్డీలు తక్కువ. ఆలస్యం అయితే జరిమానాలు చెల్లించాలి. అంతేగానీ వేధింపులు వుండవు. కానీ ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.
లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో ఈ వ్యాపారాన్ని వదులుకోవడంలేదు. లోన్ యాప్ బాధితులు ఎవరూ అధైర్య పడి,ఆత్మహత్యలు చేసుకోవద్ధు. తగిన ఆధారాలతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే ..ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నా.. యువత మాత్రం బలవన్మరణాలకు పాల్పడుతూనే వున్నారు. అప్పుల విషయంలో జాగ్రత్తగా వుండాలని, గుర్తింపు పొందిన సంస్థలలో మాత్రమే అప్పులు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో లోన్ యాప్ ల బారిన పడి అధిక వడ్డీలు కట్టలేక, బ్లాక్ మెయిలింగ్ తట్టుకోలేక అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
తాజాగా మంచిర్యాలలో లోన్ యాప్ ల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గోపాల్ వాడ కు చెందిన బొల్లు కళ్యాణి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. Small loan app,Basic loan app, Money loan app, Lending channel app, Loan product app, Shine Loan app, Hollow rupee app అనే లోన్ యాప్ లలో లోన్లు తీసుకొని సరైన టైమ్ లో చెల్లించక పోయేసరికి ఆమె ఫోన్ నుంచి యాక్సెస్ చేసుకున్న కాంటాక్ట్ నంబర్లు, వాట్సప్ గ్రూపుల ద్వారా ఆమెను బహిరంగంగా అవమానించటం మొదలుపెట్టారు. తీసుకున్న లోన్ కి భారీగానే వడ్డీలు చెల్లించింది. అయినా అప్పు తీరలేదు. బంధువులకు ఫోన్లు చేసి వేధించడంతో వారి వ్యవహారశైలితో మనస్తాపం చెంది కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడింది. లోన్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయాలని మంచిర్యాల జోన్ ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ సూచించారు.
NayanThara: ప్రియుడు కోసం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నే క్యాన్సిల్ చేసిందా..?
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!