ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు ఎత్తులు.. జిత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు… జనసేనకు వన్సైడ్ లవ్ అని కన్నుగీటారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మాటలు.. ప్రకటనలతో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్టు భావించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీ…
గుంటూరు జిల్లా మంగళగిరి. 2014 నుంచి మంగళగిరి రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. సీఎం జగన్తోపాటు విపక్షనేత చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అందుకే మంగళగిరిపై పట్టుకోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా మందుకెళ్తుంటాయి. 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చెయ్యడంతో చాలా హైప్ వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా గెలవడం పెద్ద చర్చకే దారితీసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు లోకేష్.…
ఆళ్ల నాని. మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం. ఏలూరు ఎమ్మెల్యే. సీఎం జగన్కు వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోవడంతో కినుక వహించారో ఏమో.. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఏలూరులో ఇంత వరకూ ఆ ఊసే లేదన్నది అధికారపార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ రెండేళ్లు జనంలో ఉండాలని.. గ్రాఫ్ పెంచుకోవాలని సీఎం జగన్ సూటిగా సుత్తిలేకుండా చెప్పినా.. ఆళ్ల నానిలో…
చింతల రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. గత రెండు ఎన్నికల్లో వరసగా వైసీపీ నుంచి గెలిచారు. అంతకుముందు వాయల్పాడు ఎమ్మెల్యేగానూ పనిచేశారు చింతల. ఈ సీనియరిటీ రాజకీయంగా కలిసొస్తుందని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటున్నారట ఎమ్మెల్యేలు. పైగా పీలేరులో నల్లారి కుటుంబంపై గెలవడంతో వైసీపీలో గుర్తింపునకు కొదవే ఉండదని అనుకున్నారట. అయితే జరుగుతున్న పరిస్థితులు.. ఆశలు నెరవేరకపోవడం ఎమ్మెల్యేను కుంగతీస్తున్నట్టు సమాచారం. ఆ ఆవేదనలోనూ కూరుకుపోతున్నారట. 2019లోనే కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. మొన్నటి కేబినెట్…
రాజకీయాలు అంటేనే గ్రూపులు ఉంటాయి. అందులోనూ అధికారపార్టీ అయితే ఆ సమస్య మరింత జఠిలం. రెండు, మూడు కూటములు ఉంటేనే భరించడం కష్టం. అటువంటిది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 10వరకు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీలో గెలిచి వైసీపీ పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి ఎంట్రీతో ఇక్కడ పాలిటిక్స్ హీటెక్కడం మొదలైంది. ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్య నాయకులు పార్టీలో చేరగా.. కొత్తవాళ్లతో సర్దుకుపోవడం ఆవిర్భావం నుంచి వైసీపీ జెండా మోసిన వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో…
ఆత్మకూరు అసెంబ్లీకి ఈ నెల 23న ఉపఎన్నిక జరగనుంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరిగిన రెండు ఉపఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఆత్మకూరు వంతు వచ్చింది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లో మేకపాటి గౌతంరెడ్డి వరసగా గెలిచారు. కాకపోతే 2014లో 31 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. 2019లో 22 వేల ఓట్లకే అది పరిమితమైంది. గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ…
ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల సమయంలో కలిసి సాగిన నేతలు ప్రస్తుతం చెరోదారి అయ్యారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయబోనని బూచేపల్లి చెప్పడంతో మద్దిశెట్టికి ఛాన్స్ ఇచ్చింది పార్టీ. ఆ సమయంలో ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. కానీ.. తర్వాతే మార్పు వచ్చింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. బ్యానర్లు చించివేత, శిలాఫలకాల ధ్వంసం.. పార్టీ ఆఫీసులపై దాడి.. కరపత్రాల పంపిణీ…
డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ జైలులో ఉన్నప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో ఏ పనైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందట. నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. రంపచోడవరం వ్యాప్తంగా తనకు నమ్మకంగా ఉన్న అనుచరులతో…
చిత్తూరులో అధికార పార్టీ కేడర్… ద్వితీయ శ్రేణి నాయకులు మెత్త పడ్డారా..? మునుపటి జోష్ లేకపోవడానికి కారణం ఏంటి? ఏదైనా కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం ఆలస్యం… ఓ రేంజ్లో హడావిడి చేసే నాయకులు ఇప్పుడు ఏమైపోయారు? ప్రస్తుతం ఆజిల్లాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఏ పార్టీకి అయినా కేడర్లకే బలం. ఇక నాయకుడు ఎక్కడ ఉంటే కార్యకర్తలు ఆయన వెంట తిరుగుతుంటారు. ఎక్కడైనా జరిగేది అదే..! కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్లో ఉందన్న…