YCP : బాలరాజుకు ఏమైంది? సొంత పార్టీ వైసీపీలోనే సెగ మొదలైందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం పోలవరం. 42 వేల ఓట్లకుపైగా మెజార్టీతో నాలుగోసారి గెలిచారు తెల్లం బాలరాజు. అయితే ఎన్నికల తర్వాత నుంచి మారుతున్న పరిణామాలతో నియోజకవర్గంలో అధికారపార్టీ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, పునరావాస కల్పన గతంకంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. నియోజకవర్గ అభివృద్ది విషయంలో ఆశించిన ఫలితాలను రాబట్టడంలో ఎమ్మెల్యే వెనకపడ్డారన్నది పార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ విషయంలో వైసీపీ లోకల్ లీడర్సే బాలరాజుపై అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.
2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బాలరాజు.. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి మళ్లీ గెలిచినా.. కేడర్పై పట్టుకోల్పోయారని ప్రచారం జరుగుతోంది. సీనియారిటీకి తగ్గట్టుగా ఎమ్మెల్యే పనితనం లేదని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయట. పోలవరంలో అభివృద్ధి పనులను పట్టాలెక్కించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఏజెన్సీలో రహదారులు లేక, మౌలిక వసతులకు దూరమై.. పదే పదే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా చేయడం లేదన్నది స్థానిక కేడర్ చెప్పేమాట. 2014లో ఓడి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజలతో టచ్లో ఉన్న బాలరాజుకు 2019లో గెలిచిన తర్వాత ఏమైందో కేడర్కు అర్థం కావడం లేదట.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే.. అందులో బాలరాజు సొంతమండలమైన బుట్టాయగూడెంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలవరం, టి నరసాపురం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెంలో ఇతర పార్టీల నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని వైసీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణ. ఆ ప్రభావం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై పడినట్టు చెబుతున్నారు. పైగా పోలవరం వైసీపీలో ప్రస్తుతం గ్రూపులు ఎక్కవయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రూపులను ఎమ్మెల్యే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని చెబుతారు. దాంతో చాలా మంది వైసీపీ లోకల్ లీడర్స్ గడప దాటడం లేదట.
పక్కపార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చి.. వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారిని విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో మొదటికే మోసం వస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయట. కోటకు బీటలు వారకముందే ఎమ్మెల్యే బాలరాజు స్పృహలోకి వస్తే.. అన్నీ గాడిలో పడతాయని… లేకపోతే పరిస్థితులు చేయ్యి దాటిపోతుందని హెచ్చరిస్తున్నారట. మరి.. బాలరాజు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!