వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరుపై మండిపడ్డ ఆయన.. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండని, వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని జక్కంపూడి…
ఈరోజు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం జరగనుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో కలెక్టర్కు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో.. అవిశ్వాస తీర్మానికి కౌన్సిలర్లు సిద్దమయ్యారు. జబీవుల్లాపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదానికి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కౌన్సిల్ హాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో జబీవుల్లాను పదవి నుంచి తప్పించి.. టీడీపీలో ఉన్న కౌన్సిలర్కు వైస్…
తప్పకుండా అధికారంలోకి వస్తాం అని, అందులో ఎలాంటి సందేహం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం (కూటమి ప్రభుత్వం) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాకముందు మన పథకాల ద్వారా పేదల…
మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారని.. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా…
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలు పార్టీలో చేశారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘ మాజీ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్ అని పేర్కొన్నారు. జగన్ లాంటి వ్యక్తిని మరలా సీఎం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో పని చేస్తామన్నారు. వైఎస్ జగన్ గారికి సపోర్టుగా ఉండాలని ఉద్యోగ సంఘ…
పాకిస్తాన్పై భారత్ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. భారత్లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం అని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్పై వైఎస్ జగన్ ట్విట్టర్…
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ... ఆ దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు టీడీపీ నాయకులు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అక్రమ మైనింగ్కు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే కేసు బుక్ అయింది.
ఆయన వైసీపీ మాజీ మంత్రి…అధికారంలో ఉన్నపుడు టీడీపీ, జనసేనలో ప్రధాన నేతలపై హద్దులు దాటి విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ మాజీ మంత్రి అంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడలి పోతున్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు బెంబేలెత్తి పోతున్నారు. లెట్స్ వాచ్. జోగి రమేష్…ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నేత. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మొదలు పవన్…
వరుస కుంభకోణాలు.. ఆ జిల్లా నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా?. మదనపల్లి ఫైల్స్, టీడీఆర్ బాండ్స్, నకిలీ ఎపిక్ కార్డ్స్, ఆడుదాం ఆంధ్రా.. ఇలా ఏ స్కాం చూసినా ఆ జిల్లా నేతలే నిండా మునిగిపోయారా?. ఎప్పుడు ఎవరి మీద కేసు నమోదవుతుందో? ఎవర్ని విచారణకు పిలుస్తారోనన్న టెన్షన్ వైసీపీ నేతలు వెంటాడుతోందా?. మొన్నటి వరకు ధీమా ఉన్న నేతలు సైతం.. ఇప్పుడు లోలోపల భయంతో వణికిపోతున్నారా?. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ…
కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలం నుండి సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు 11వేల కోట్ల స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక అధిక రేట్లు పెంచేస్తున్నారని…