విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీతారామన్ పాల్గొననున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో నేడు నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఫెస్టివల్లో పాల్గొంటారు ఆర్ధిక మంత్రి. తర్వాత విశాఖలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. రేపు నిర్మలా సీతారామన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంను సందర్శించనున్నారు. తాళ్లపాలెంలో రేషన్…
పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఊడిపోయిన పదహారో గేట్ దగ్గర మరమ్మతు పనులు కొనసాగుతున్నాయ్. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి వచ్చిన నిపుణుల బృందం ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. స్టాప్ లాక్ ఏర్పాటులో భాగంగా ఒక ట్రయల్ వేయగా అది విజయవంతమైంది. దాదాపు 45 టీఎంసీల నీరు ఉండే ప్రాజెక్టును ఖాళీ చేశారు. డ్యామ్ నీటి మట్టం 6.5 టీఎంసీలకు తగ్గిపోయింది.పదహారో గేటు స్పియర్ బేస్తో సహా కొట్టుకుపోవడంతో…
ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి అధికారపార్టీ పంచన చేరారు. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అసమ్మతి ఆరునొక్క రాగం అందుకుందట. దీంతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ఎలా బయటపడతారోననే చర్చ మొదలైంది. వాసుపల్లి పార్టీ మారినా వైసీపీలో పెద్దగా మార్పు లేదట! వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ పవర్లో ఉన్నప్పుడు వైసీపీపై…
విశాఖ:- రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం సాయంత్రం విశాఖకు రానున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక ఈ పర్యటనలో రేపు శ్రీకాకుళం జిల్లా పొందురులో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకల్లో పాల్గొనున్నారు ఆర్ధిక మంత్రి. రేపు సాయంత్రం విశాఖ పెడవాల్తేరులో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా. ఆదివారం కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధులను సందర్శించనున్న నిర్మల సీతారామన్…75ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అల్లూరి ఘాట్ ను సందర్శించనున్నారు. ఇక ఆదివారం సాయంత్రం తాళ్ల…
ఆయన ఎన్నికల్లో గెలవలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో ఇంఛార్జ్ హోదాలో నియోజకవర్గంలో పెత్తనం ఆయనదే. చేతిలో పవర్ ఉన్నా కాలం కలిసిరావడం లేదట. మెతకగా ఉంటున్నారని అలుసుగా తీసుకున్నారో ఏమో.. అంతా ఆయన పేరును వాడేసుకుంటున్నారట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంఛార్జ్. సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు! అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వచ్చిన రెండు సీట్లలో ఇచ్ఛాపురం ఒకటి. బెందాళం అశోక్ గెలిచినా.. ఆయనపై ఓడిన వైసీపీ…
కాసేపటి క్రితమే… రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వై.సి.పి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన భయపడబోమని చెప్పారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తోపాటు టిడిపి నేతలు నాకు మద్దతు ఇచ్చి ధైర్యం చెప్పారని.. అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే అరెస్టు చేశారని..దాడి జరిగిన సమయంలో పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని చెప్పారు. దాడి జరిగిన సమయంలో దాదాపు ఏడు…
ఆ ఎమ్మెల్యేతో అన్నీ పేచీలేనా? పార్టీ నేతలతో గ్యాప్ వచ్చిందా? కేడర్ విసుగెత్తి దూరం జరిగిందా? లోక్సభ ఉపఎన్నికపైనా ఆ ప్రభావం పడిందా? అయినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మార్పు లేదా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయనెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. స్థానిక వైసీపీ నేతలతో ఎమ్మెల్యేకు విభేదాలు! నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్. గతంలో తిరుపతి ఎంపీగానూ పనిచేశారు ఈ మాజీ ఐఏఎస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో గూడూరు నుంచి…
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. తగ్గితే పరపతి పోయినట్టే అనుకుంటున్న ఈ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటూనే ఉన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కోసం హైకమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. విబేధాలు ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవా? ఇంతకీ ఎవరు వారు? ఎమ్మెల్యేగా గెలిచాక హఫీజ్ఖాన్.. ఎస్వీని దూరం పెట్టారా? కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే…
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా తిరిగి బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతున్నది. 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసి కొన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ దృష్టిమొత్తం ఏపీపైనే ఉంచడంతో తెలంగాణలో పార్టీ వెనుకబడిపోయింది. ఇక, 2018 తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీనే చేయలేదు. దీంతో ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా బలహీనపడింది. ఒకప్పుడు అనేక మంది కార్యకర్తలు, నేతలు ఉండేవారు.…
టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కొండపల్లి మైనింగ్ పై తెదేపా నేత పట్టాభి ఆరోపణలను ఖండించిన ఆయన.. అబద్దాలను నిజం చేయాలని తెదేపా నేతలు, పట్టాభి ప్రయత్నాలు చేస్తున్నారని.. లోయ గ్రామంలో లేని 143 సర్వే నెంబర్ ను వైఎస్ హయాంలో సృష్టించారని పట్టాభి ఆరోపించారని.. 1993లో ఒక వ్యక్తి దరఖాస్తు…