Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Own Party Leaders Blaming Ttd Decisions

టీటీడీ నిర్ణయాలకు తూట్లు పొడుస్తున్న సొంత పార్టీ నేతలు ?

Published Date :August 24, 2021 , 2:06 pm
By Lakshmi Narayana
టీటీడీ నిర్ణయాలకు తూట్లు పొడుస్తున్న సొంత పార్టీ నేతలు ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇల వైకుంఠంలో ఆయన సామాన్య భక్తులకు ప్రాధాన్య ఇవ్వాలన్నారు. తమ అనుచరులకు బాగా దర్శనం జరిగితే చాలనుకుంటున్నారు వాళ్లు. దర్శనం విధానంలో మార్పులు తీసుకొస్తే తూట్లు పొడుస్తున్నారు కూడా. ఇంతకీ ఆయన తెచ్చిన మార్పులేంటి? అడ్డుపడుతున్నవారు ఎవరు? లెట్స్‌ వాచ్‌!

అనుచరులకు ప్రొటోకాల్ దర్శనం కోరుకుంటున్న ప్రజాప్రతినిధులు!

Also Read

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

టీటీడీ పాలకమండలి చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేశారు. అందరికీ ఒకే దర్శనం విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రొటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులకు ముందుగా దర్శనం కల్పించి.. తర్వాత సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనం భక్తులను అనుమతిస్తోంది టీటీడీ. ప్రొటోకాల్‌ అంటే స్వామివారి ముందు తీర్థం, శఠారి ఇస్తారు. అది ప్రొటోకాల్‌ లిస్ట్‌లో ఉండే సీఎంలు, గవర్నర్‌లు, కేంద్రమంత్రులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిలభారత సర్వీస్‌ అధికారులు ఉంటారు. అంతకుముందు ఎల్‌1, ఎల్‌ 2, ఎల్‌ 3 ఉన్నప్పుడు ఈ ప్రొటోకాల్‌ లిస్ట్‌లో చాలా మందే వచ్చేవాళ్లు. ఇప్పుడు దాన్ని రద్దు చేయడంతో తమలాగే తమ అనుచరులకు స్వామి వారి ముందు సకల మర్యాదలు కోరుకుంటున్నారు నేతలు.

ఛైర్మన్‌ నిర్ణయాలకు సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు తూట్లు!

కొత్త పద్ధతిలో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం కేటాయించే వెసులుబాటు టీటీడీకి లభించింది. చైర్మన్ సుబ్బారెడ్డి నిర్ణయంపట్ల భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ.. రాష్ట్రంలోని కొంతమంది అధికారపార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం వీటికి తూట్లు పోడిచేలా వ్యవహరిస్తూ.. ఆరోపణలకు ఆస్కారం ఇస్తున్నారు.

36 మందితో వచ్చిన మంత్రి వేణుగోపాల్
55 మందితో వచ్చిన మంత్రి జయరాం

కొంతమంది ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు కూడా ప్రొటోకాల్ దర్శనాలు కల్పించాలని టీటీడీపై ఒత్తిడి చేస్తున్నారు. చైర్మన్ ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా తీసుకొచ్చిన దర్శనం విధానంలో మార్పులు చేసేందుకు అధికారులు అంగీకరించడం లేదు. దీంతో ప్రజాప్రతినిధులు కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు. తాము సిఫారసు చేస్తే ప్రొటోకాల్ దర్శనాలను టీటీడీ అధికారులు కేటాయించకపోవడంతో అనుచరుల కోసం స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అనుచరులతో కలసి స్వయంగా తిరుమలకు వస్తున్నారు. ఆగస్టు 1న మంత్రి వేణుగోపాల కృష్ణ 36 మందితో ప్రొటోకాల్ దర్శనానికి వెళ్లితే.. మరో మంత్రి జయరాం 55 మందితో గుళ్లోకి వెళ్లారు. ఇదే విధంగా మిగతా మంత్రులు కొండకకు వస్తున్నారు.

అనుచరులు అడిగితే వారానికి ఒకసారైనా కొండెక్కే డిప్యూటీ సీఎం?

చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుచరులు అడిగితే డిప్యూటీ సీఎం వారానికి ఒక్కసారి కొండా ఎక్కాల్సిందే. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి దర్శనం చేయించడం కోసం టీటీడీ చైర్మన్ తిరుమల వచ్చారు. అదేరోజు అనుచరులతో దర్శనానికి వచ్చిన డిప్యూటీ సీఎం..కిషన్‌రెడ్డి పర్యటనను లైట్ తీసుకున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలైతే రోజు మార్చి రోజు తిరుమల వచ్చేస్తున్నారు. ఇదంతా స్వామి వారి మీద ఉన్న భక్తి అనుకుంటే పొరపాటే. భక్తితోపాటు అనుచరలకు ప్రొటోకాల్ దర్శనం కల్పించడం కోసమే అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే నీరుగార్చడం చర్చకు దారితీస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • off the record
  • tirumala
  • TTD Decisions
  • ycp

తాజావార్తలు

  • Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్‌లో హింస..

  • Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!

  • Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!

  • Tamil Producers: మే 2వ తేదీన తమిళ్ నిర్మాతల ‘టోకెన్ స్ట్రైక్’

  • Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions