ఏపీ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్న లీకుల చిక్కులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. చేసే సమీక్షల్లో కొన్ని రహస్యంగా ఉంటాయి.. మరికొన్ని బయటకు చెబుతారు. కానీ.. రహస్యంగా ఉంచాల్సిన అంశాలే ఏపీలో బయటకొచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి చికాకులు తప్పడం లేదు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారట. వాటిపైనే ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లీకులపై విపక్షాలకు సమాధానాలు చెప్పడానికే టైమ్ సరిపోతోందా?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఆర్థికపరమైన అంశాలు.. ప్రభుత్వం వేసుకున్న లెక్కలు.. అందులో తప్పిదాలు.. నిర్లక్ష్యాలు.. నిబంధనల ఉల్లంఘనలు అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతున్నారు. కేంద్రం అడిగే ప్రశ్నలకు.. వేస్తున్న కొర్రీలకు వివరణ ఇస్తున్నారు. దీనివల్ల రాష్ట్రసర్కార్కు వచ్చే ఇబ్బంది కానీ.. రాజకీయంగా డ్యామేజ్ ఏదీ లేకున్నా.. ప్రభుత్వ ప్రయార్టీలను పక్కన పెట్టి యంత్రాంగం అంతా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. తమకు లభించిన చిన్న డాక్యుమెంట్లను పట్టుకుని విపక్షాలు కోర్టులకు వెళ్తుండడం కూడా తలనొప్పిగా ఉంటోందని భావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ క్రమంలో ఫైనాన్షియల్ మేటర్స్కు టాప్ సీక్రెట్ హోదా కల్పించాలని నిర్ణయించారట. అధికారులకు సమాచారం వెళ్లిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా చేసిన సూచనల్లో కొన్ని కీలకాంశాలు ఉన్నాయట.
ముఖ్యమైన అంశాలు సమీక్షల్లో కాకుండా విడిగా కలిసి చర్చించాలి!
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకుండా సమీక్షలకు ప్రాధాన్యం!
సీఎం జగన్ దగ్గర జరిగే సమీక్షల్లో ఆర్థిక అంశాల ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడాలని క్లియర్ మెసేజ్ వెళ్లిందట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లోని పెండింగ్ బిల్లుల గురించి సీఎంతో జరిగే సమీక్షలో కాకుండా.. విడిగా ముఖ్యమంత్రి లేదా సీఎం పేషీ అధికారులతో సదరు శాఖ ఉన్నతాధికారులు చర్చించాలని సూచించారట. సమీక్షల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల కాపీలు బయటకు వెళ్లిపోతున్నాయి. అక్కడి నుంచే అసలు సమస్య వస్తుందని ప్రభుత్వం గుర్తించిందట. పెండింగ్ బిల్లులు.. నిధుల లేమి కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీల రూపంలో లీకవుతున్నట్టు తెలుసుకున్నారట. దీంతో సమీక్షల్లో వీలైనంత తక్కువగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండేలని ఆదేశించినట్టు తెలుస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకుండానే సమీక్షలకు హాజరు కావాలనే ఆదేశాలు కూడా వెళ్లినట్టు సమాచారం. ఒకవేళ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ తప్పనిసరైతే.. వాటిని చూపించిన వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించారట.
ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా అధికారులను అప్రమత్తం చేశారా?
సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా ఈ సూచలను అధికారులకు అందించినట్టు చెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. రావాల్సిన అంశాలు బయటకు రాకుండా ఉంటాయా..? అనే చర్చ కూడా జరుగుతోంది. మరి.. ప్రభుత్వం చేపట్టిన చర్యలు పాలకులకు ఏ మేరకు ఉపశమనం కలిగిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
-
Mercedes-Benz AMG E 53: మెర్సిడెస్ బెంజ్ AMG E 53 విడుదల.. 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!