ముఖ్యమంత్రి జగన్.. మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారా? త్వరలోనే ఆయన దేశ రాజధానిలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవనున్నారా? ఈ ప్రశ్నలకు.. అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే.. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అపాయింట్ మెంట్ సైతం జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సమావేశం ఖరారైతే.. జగన్ ఢిల్లీ బయల్దేరే అవకాశం ఉంది. ఈ ఊహాగానాలు నిజమై ఢిల్లీకి వెళ్తే.. జగన్ ఏం చేయబోతున్నారు? కేంద్రం…
అవకాశం ఉన్న ఏ చోటునూ వదలకుండా విస్తరించుకుంటూ పోయేందుకు సీపీఐ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ లోనూ తమ వాణి వినిపించేందుకు.. అక్కడ సైతం జనాల్లో ఎంతో కొంత పట్టును పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే అమరావతి పోరాటంలో సీపీఐ నేతలు కాస్త క్రియాశీలకంగా ముందుకు పోతున్నారు. ఇతర సమస్యలపైనా.. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. తాజాగా.. ఆ పార్టీ జాతీయ నాయకత్వం సైతం ఆంధ్రాపైనే దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెంచే దిశగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది.…
వినాయక చవితి పండగ దగ్గరికొస్తోంది. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి. వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని.. కోవిడ్ కారణంగా ఎక్కువగా జనాలు గుమికూడవద్దని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇదే.. బీజేపీ, టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఇతర కార్యక్రమాలకు అడ్డు రాని కరోనా.. ఇప్పుడు వినాయక చవితి పండగకే అడ్డు పడుతోందా.. అన్న చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ…
ఆంధ్రప్రదేశ్ లో రహదారుల చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. దెబ్బతిన్న రహదారులపై.. విపక్షాలు సమరభేరి మోగిస్తుంటే.. అధికార పక్షం సైతం దీటుగా స్పందిస్తూ.. టగ్ ఆఫ్ వార్ గా ముందుకు వెళ్తోంది. అవసరమైతే అప్పులు సైతం తీసుకునైనా రోడ్లు బాగు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంటే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నాయి.ఇప్పటికే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఉధృతంగా ప్రచారంలోకి…
వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. వాహనదారులకు రోడ్లు నరకపాయంగా మారిపోయాయి.. ఏపీ ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో విమర్శలు కూడా వెల్లువిత్తాయి.. ఈ నేపథ్యంలో రోడ్లు బాగు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, శంకర్నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి.. సంబంధిత అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబర్ మాసానికల్లా వర్షాలు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా…
కేంద్రంలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఏపీలో మాత్రం బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో కాస్తోకూస్తో బలంగా ఉన్న బీజేపీ రాష్ట్రవిభజనతో రెండు ప్రాంతాల్లోనూ పుంజుకునే పనిలో పడింది . తెలంగాణలో మాత్రం బీజేపీ క్రమంగా బలపడుతుండగా.. ఏపీలో మాత్రం ఎదుగుబొదుగు లేకుండా ఉందనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ కొత్త బీజేపీ అధ్యక్షులను బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. ఏపీలో కొత్త…
గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీలో ఆందోళన చేపట్టింది. కర్నూలు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు… కలెక్టర్ ఇంటిని ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్రెడ్డిసహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతలను బలవంతంగా స్టేషన్కి తరలించారు పోలీసులు. కాగా… ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించిన సోమువీర్రాజు… ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పై ఏపీ సర్కార్…
లెక్కలేనన్ని పథకాలు..నెలనెలా ఇంటికే డబ్బులు. ఇళ్లు, స్థలాలు..ఒకటేమిటి.. అసలు సిసలు సంక్షేమ రాజ్యం అంటే ఏంటో ఏపీలోనే చూడాలన్నట్టు ప్రభుత్వం ఉంది. అసంతృప్తి అనేదే లేని జనం మా దగ్గర ఉన్నారని అధికార పార్టీ ఘనంగా చెప్పుకుంటుంటే, పాపం ఎమ్మెల్యేలు మాత్రం లబోదిబో అంటున్నారట. ప్రజలంతా హ్యాపీగా ఉంటే ఎమ్మెల్యేలకు వచ్చిన ప్రాబ్లం ఏమిటనుకుంటున్నారా? అయితే చూడండి.. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 2 సీటత్లు మినహీఆ అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. దానికి తగ్గట్టుగానే…
వినాయక చవితి వస్తుందంటే ఊళ్లల్లో ఉండే సందడే వేరు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ప్రతియేటా ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. పండుగలను సంబరంగా చేసుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో చాలా అరుదైన చెప్పొచ్చు. గతేడాది కరోనా కారణంగా పండుగలన్నీ కళతప్పాయి. కరోనా నిబంధనల మధ్య మొక్కుబడిగా కొన్ని పండుగలకు…