Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Jagan Sensational Decision On Mbbs Students Issue

ఎంబీబీఎస్ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం?

Published Date :September 17, 2021 , 2:52 pm
By Lakshmi Narayana
ఎంబీబీఎస్ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక ప్రతీఒక్కరికి ఆరోగ్యం గురించిన అవశ్యకత తెలిసొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా ప్రజా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరుస్తూనే ఉన్నారు. గతంలో ఒకేరోజు వెయ్యి అంబులెన్సులను ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ రికార్డు సృష్టించింది. వెయ్యి రూపాయాల కంటే ఎక్కువ ఖర్చు చేసే వ్యాధులన్నింటిని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి పేద, సామాన్య ప్రజలకు బాసటగా నిలిచింది. ఆఖరికి కరోనా ట్రీట్మెంట్ ను సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో చేర్చారంటే ఆయనకు ప్రజల ఆరోగ్యంపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖజానాపై భారం పడుతున్నా ప్రజారోగ్యం విషయంలో ఆయన ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం వైద్యసేవలు అందబాటులోకి రానున్నాయి. ప్రతీ ఎంబీబీఎస్ విద్యార్థి ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేలా ఏపీ సర్కారు త్వరలోనే ఉత్వర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సమీక్షించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో దీనిని అమలు చేసేందుకు అవసరమైన జీవోలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీవో విడుదలైతే మాత్రం ప్రతీ ఏడాది 5,300 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది.

వీరంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక, ఆరోగ్య కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. వీరితోపాటు 2,300 మంది పీజీ విద్యార్థులు సైతం ప్రాంతీయ, జిల్లా బోధనాస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్లుగా పని చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ నిర్ణయంలో 2010లోనే నాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా అమల్లోకి రాలేదు. 2016లో అధికారంలో ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకుంది. దీంతో పీజీ విద్యార్థులకు రెసిడెన్సీ విధానాన్ని ఒక ఆప్షనల్ గా చేశారు. దీంతో అత్యధిక మంది వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది.

మరోవైపు కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు రూరల్ ప్రాక్టీస్ విధానాన్ని తీసుకొచ్చాయి. కేరళలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులను ఈ నిబంధనలను తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు సేవలు చేసిన విద్యార్ధులు పీజీలో రెసిడెన్సీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విలేజ్ క్లినిక్కులను తీసుకొచ్చారు. వీటికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.

దీంతో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విలేజ్ క్లినిక్కులు నాణ్యమైన సేవలందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఏపీ సర్కారు కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగానే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థుల సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని భావిస్తుంది. ఏదిఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం వైద్యసేవలు అందుబాటులో రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm jagan
  • MBBS students issue
  • ycp

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • LPG Cylinder Prices: యుద్ధం వేళ.. పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు.. ఎవరీ మోజ్తబా ఖమేనీ!

  • Krrish-4 : ‘క్రిష్ 4’ విషయంలో హృతిక్ రోషన్ షాకింగ్ నిర్ణయం..

  • Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్‌జాదా సంచలన కామెంట్స్!

  • Burj Khalifa: బుర్జ్ ఖలీఫా బీమా ఎంత? దుబాయ్ ఐకాన్ ఇన్సూరెన్స్ పాలసీ పూర్తి సమాచారం

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions