మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్కు యూపీ వారియర్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ జట్టు, పటిష్టమైన ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో యూపీ వారియర్స్ టోర్నీలో తమ సత్తా చాటడమే కాకుండా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల…
మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025-26 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అద్భుతమైన రీతిలో పుంజుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి 50 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం ఛేదనకు దిగిన…
Harmanpreet Kaur: నవి ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమ్ ఇండియా 52 పరుగుల తేడాతో ప్రోటియాస్పై గెలిచి తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఈ విజయానికి కెప్టెన్ హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతీ మందానా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు కీలక…
బంగ్లాదేశ్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలమ్.. ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్ ఆటగాళ్లను నిగర్ కొట్టేదని, కొన్నిసార్లు అయితే చెంప దెబ్బలు కూడా కొట్టేదని చెప్పింది. డ్రెస్సింగ్ రూమ్లో సరైన వాతావరణం కల్పించడంలో బంగ్లా కెప్టెన్ విఫలమైందని పేర్కొంది. చాలా మంది ప్లేయర్లు తమ బాధని చెప్పుకొని బాధపడేవారని జహనారా చెప్పుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఆరోపణలను ఖండించింది. గత ఏడాది…
Smriti Mandhana: సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం కానున్న ICC మహిళా వన్డే వరల్డ్కప్కు ముందు భారత క్రికెట్ స్టార్ స్మృతి మందాన ICC వన్డే మహిళా బ్యాట్స్మెన్ లేటెస్ట్ ర్యాంకింగ్స్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. ఇంగ్లండ్కు చెందిన నెట్ సివర్ను అధిగమించి ఈ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. దీనితో నెట్ సివర్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. స్మృతి మందాన తప్ప మరొక…
WPL 2025: ముంబై ఇండియన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి విజయం సాధించింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో, అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడుతూ రెండుపరుగులు పూర్తి చేసి ఢిల్లీకి విజయాన్ని అందించింది. దీంతో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. Read Also: America : అమృత్ సర్ కు చేరుకున్న అమెరికా అక్రమ వలసదారుల రెండో విమానం..…
Smriti Mandhana: 2024లో అన్ని ఫార్మాట్స్ లో అద్భుతంగా ఆడిన భారత బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా (ICC Women’s ODI Cricketer of the Year) ఎంపికైంది. విషయాన్నీ తాజాగా ఐసీసీ వెల్లడించింది. మంధాన వన్డేలలో కొత్త రికార్డ్స్ ను నెలకొల్పింది. 2024లో 13 ఇన్నింగ్స్లలో 747 పరుగులు చేసి క్యాలెండర్ ఇయర్లో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ పరుగులు చేసింది. Also Read:…
India vs Malaysia: అండర్-19 టీ20 ప్రపంచకప్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ కౌలాలంపూర్లోని బ్యుమాస్ ఓవల్లో జరిగింది. మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కేవలం 17 బంతుల్లోనే 10 వికెట్ల తేడాతో మలేషియాపై టీమిండియా విజయం సాధించింది. మలేషియా జట్టు కేవలం 14.3 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరపున వైష్ణవి శర్మ కేవలం 5 పరుగులిచ్చి 5…