Nigar Sultana: జూనియర్లను గదిలోకి పిలిచి.. బంగ్లా కెప్టెన్పై సీనియర్ పేసర్ ఆరోపణలు!
- బంగ్లా కెప్టెన్పై సీనియర్ పేసర్ ఆరోపణలు
- జూనియర్లను నిగర్ చెంప దెబ్బలు కొట్టేది
- జూనియర్ని గదిలోకి పిలిచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలమ్.. ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్ ఆటగాళ్లను నిగర్ కొట్టేదని, కొన్నిసార్లు అయితే చెంప దెబ్బలు కూడా కొట్టేదని చెప్పింది. డ్రెస్సింగ్ రూమ్లో సరైన వాతావరణం కల్పించడంలో బంగ్లా కెప్టెన్ విఫలమైందని పేర్కొంది. చాలా మంది ప్లేయర్లు తమ బాధని చెప్పుకొని బాధపడేవారని జహనారా చెప్పుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఆరోపణలను ఖండించింది.
గత ఏడాది డిసెంబర్లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో జహనారా ఆలమ్ చివరిసారిగా ఆడింది. బంగ్లాదేశ్ దినపత్రిక కలేర్ కాంథోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహనారా మాట్లాడుతూ… ‘ఇది కొత్తేమీ కాదు. నిగర్ సుల్తానా జూనియర్లను బాగా కొడుతుంది. వన్డే ప్రపంచకప్ 2025 సమయంలో కూడా జూనియర్లను చెంప దెబ్బలు కొట్టింది. ఈ విషయం బాధితులే స్వయంగా నాతో చెప్పారు. దుబాయ్ టూర్ సమయంలో ఒక జూనియర్ని గదిలోకి పిలిచి చెంపదెబ్బ కొట్టింది. నిగర్ సుల్తానాకు కోపం ఎక్కువ. మళ్లీ ఆ తప్పు చేయను అని ప్లేయర్స్ చెప్పినా వినదు. కొడుతూనే ఉంటుంది’ అని వివరించింది.
Also Read
- Vaibhav Sooryavanshi: 'మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను'.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
- Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
Also Read: IND vs AUS: మొన్న గిల్, నిన్న జితేష్.. ఇక సంజు శాంసన్ పనైపోయినట్లేనా?
‘జట్టు ఎంపికలో పక్షపాతం, రాజకీయాలు ఎక్కువగ ఉంటాయి. బాధితుల జాబితాలో నేను ఒక్కదానినే లేను. జట్టులోని ప్రతిఒక్కరూ బాధితులే. అందరి సమస్య భిన్నంగా ఉంటుంది. ఒకరిద్దరికి మాత్రమే మంచి సౌకర్యాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకరికి మాత్రమే అన్నీ ఇవ్వబడతాయి. 2021లో నాతో పాటు మరికొందరు సీనియర్లను పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ సమయంలో నేను మూడు జట్లలో ఒకదానికి కెప్టెన్. మిగతా రెండింటికి నిగర్, షర్మిన్ ఉన్నారు. అప్పుడే సీనియర్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరగడం ప్రారంభమైంది. గత కొన్ని సంవత్సరాలుగా జట్టు వాతావరణం క్షీణించింది. మానసిక ఒత్తిడి కారణంగా క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా’ అని జహనారా ఆలమ్ చెప్పింది. జహనారా బంగ్లాదేశ్ తరఫున 52 వన్డేల్లో 48 వికెట్లు, 83 టీ20ల్లో 60 వికెట్లు పడగొట్టింది. అయితే బీసీబీ మాత్రం జహనారా వ్యాఖ్యలను ఖండించింది. జహనారా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపడేసింది.
తాజావార్తలు
-
Snapchat Love Story: స్నాప్చాట్ లవ్.. కశ్మీర్ పిల్లను పెళ్లాడేందుకు LoC దాటిన పాక్ కుర్రాడు.. చివరికి ఏమైందంటే?
-
Varanasi: బర్త్డేకు ‘వారణాసి’ ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్
-
India LNG supply: ఎల్ఎన్జీ సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం.. పరిశ్రమలకు భారీ ఊరట
-
Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల సీన్ చూసి ట్రంప్ మైండ్ బ్లాక్.. అసలు నిజం ఒప్పుకున్న అమెరికా బాస్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!