Harmanpreet Kaur: హర్మన్ప్రీత్ ఇకనైన కెప్టెన్సీ నుంచి తప్పుకో.. వాటిపై దృష్టి పెట్టు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur: నవి ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమ్ ఇండియా 52 పరుగుల తేడాతో ప్రోటియాస్పై గెలిచి తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఈ విజయానికి కెప్టెన్ హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతీ మందానా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. మొత్తం జట్టు సమన్వయంతో సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ విజయానంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆటగాళ్లను కలుసుకుని అభినందించిన సంగతి తెలిసిందే.
High Alert In Hyderabad: ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్.. హైదరాబాద్ సిటీలో నాకా బందీ..!
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
అయితే ఈ సంబరాల మధ్య మాజీ భారత కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ.. హర్మన్ప్రీత్ ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకుని బ్యాటింగ్, ఫీల్డింగ్పై ఎక్కువ దృష్టి పెట్టాలి అని సూచించారు. జట్టు భవిష్యత్తు దృష్ట్యా మార్పులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లలో మిశ్రమ స్పందన కనపరిచింది. చాలా మంది రంగస్వామి వ్యాఖ్యలను విమర్శిస్తూ.. హర్మన్పై నమ్మకం ఉంచాలని కోరారు.
ఈ నేపథ్యంలో మాజీ భారత కెప్టెన్ అంజుమ్ చోప్రా ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రంగస్వామి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ప్రతి వరల్డ్కప్ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు వస్తుంటాయి. గత నాలుగు ఐదు వరల్డ్కప్పులను పరిశీలిస్తే ప్రతిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని మీరు చూడవచ్చు. భారత్ ఓడినా, గెలిచినా హర్మన్ను తీసేయాలని మాట్లాడతారని అన్నారు. అలాగే, ఇప్పుడు ఈ విజయ సమయంలో ఇలాంటి విషయాలపై మాట్లాడటం సరికాదు. ఇది జట్టు సంబరాలను చెడగొడుతుందని అన్నారు.
Airtel Prepaid Plan: యూజర్లకు షాక్.. ఆ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను నిలిపివేసిన ఎయిర్టెల్
అలాగే హర్మన్ ప్రతిభపై మాట్లాడిన అంజుమ్.. మొదటి రోజు నుంచే ఆమె ప్రత్యేకమని నాకు తెలిసింది. 2007-08లో ముంబైలో జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో ఆమె బలమైన షాట్లు ఆడిన తీరు నాకు బాగా గుర్తుంది. ఆ సమయంలోనే ఈమె భారత జట్టులో పెద్ద స్థాయిలో సాధిస్తుందని నమ్మకం వచ్చిందని చెప్పింది. అలాగే హర్మన్ ఎప్పుడూ మ్యాచ్ విన్నర్గానే ఉందని.. అందుకే ఆమె కెప్టెన్గా కొనసాగాలని తాను ఎప్పుడూ విశ్వసించానని అభిప్రాయపడింది. వరల్డ్ కప్ విజయంతో భారత మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఈ జట్టు భారత క్రికెట్ అభిమానులకు మరపురాని క్షణాలను అందించిందని పేర్కొంది.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!