మందుబాబులకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. లోకల్ బ్రాండ్స్ తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలుతో తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో రీల్ కోసం ఓ మహిళ వీడియోకు ఫోజులిస్తున్న సమయంలో ఓ దొంగ బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం చెందింది. మృతురాలిని అర్షియా జోషిగా గుర్తించారు. మార్చి 21న ఆర్షియా జోషీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతేడాది ఈ యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ ఘటన గురించి జోషి కుటుంబానికి భారతీయ రాయబార కార్యాలయం సమాచారం అందించింది. ఘటనపై న్యూయార్క్లో భారతీయ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ…
Rajanna Sircilla: కార్మిక శిబిరం సిరిసిల్లలో దారుణం చోటుచేసుకుంది. కూలి పనికి వెళ్లిన మహిళపై వలస కూలీలు దాడి చేశారు. మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డాడు.
భారతదేశంలో కొంతమంది సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారాన్ని చిటికెలో కనిపెడతారు. సమస్య పెద్దదా లేక చిన్నదా అని తేడా లేకుండా పరిష్కారం కోసం అవసరానికి తగ్గట్టు సమస్య నుంచి బయటపడతారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను చూస్తే మనకి మతిపోక తప్పదు. ఇక వీడియో విషయానికి వస్తే.. వర్షంలో వెళ్తున్న సమయంలో ఆ కార్ వైపర్స్ పాడైపోయాయి. అయితే ఆ సమయంలో కార్లో ఉన్న దంపతులు కనుగొన్న పరిష్కారం చూస్తే…
Woman strangled to death in Telangana: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలో మల్లవ్వ (45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొంతు కోసి హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. మల్లవ్వ గొంతు కోసి అతికిరాతంగా చంపేశారు. గొంతు కోయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మల్లవ్వ చుట్టుపక్కల పెద్దగా ఇళ్లులు లేకపోవడంతో దుండగుల పని ఈజీ అయింది. Also Read: IND…
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఘరానా మోసం జరిగింది. మంత్రాలతో చేతబడిని తొలగిస్తాను, దెయ్యాన్ని తొలగిస్తాను అంటూ నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళకు టోకరా వేసిన ఘటన ఫిల్మ్నగర్లో చోటుచేసుకుంది.
తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన చిన్ననాటి స్నేహితురాలు కలలోకి వచ్చి తన దగ్గరికి రమ్మంటుందని మృతురాలు తన సోదరుడికి చెప్పి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 సంవత్సరాల క్రితం మరణించిన స్నేహితుడు కలలోకి వస్తున్నాడని భయపడుకుంటూ చెప్పి.. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్షాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
గగనతలంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం (Flight) ఆకాశంలో ఉండగా ఓ మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయి. పురుడుపోయడానికి డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. దీంతో పైలట్ తెగించి ఆమెకు పురిడిపోయడానికి ముందుకొచ్చాడు.