Man kills wife: కట్నంగా ఫార్చ్యునర్ కారు ఇవ్వలేదని.. భార్యను చంపేసిన భర్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్ కారుతో పాటు 21 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చంపేశారు. గ్రేటర్ నోయిడాలోని ఖాడా చౌగన్పూర్ అనే గ్రామంలో నివాసం ఉండే వికాస్ అనే వ్యక్తికి.. 2022 డిసెంబర్ లో కరిష్మ అనే మహిళతో పెళ్లి అయింది. అప్పుడు కట్నం కింద వికాస్ కుటుంబానికి 11లక్షల రూపాయల క్యాష్ తో పాటు ఒక ఎస్యూవీ కారుని కరిష్మ తల్లిదండ్రులు ఇచ్చారు.
Read Also: RCB vs LSG Dream 11 Prediction: బెంగళూరు, లక్నో డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
కానీ, పెళ్లి తర్వాత కూడా కట్నం గురించి కరిష్మను వికాస్ కుటుంబ సభ్యులు వేధించడం మొదలు పెట్టారు. ఇక, కరిష్మ సోదరుడు దీపక్ మాట్లాడుతూ..వికాస్ కుటుంబం అనేకసార్లు నా సోదరిని భౌతికంగా, మానసికంగా హింసించారు అని పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితం వికాస్-కరిష్మలకు ఆడ బిడ్డ పుట్టింది.. ఇక, అప్పటి నుంచి కట్నం వేధింపులు మరింత పెరిగాయన్నాడు. ఈ వ్యవహారం స్థానిక పంచాయతీ పెద్దల దృష్టికి కూడా వెళ్లాం.. రెండు కుటుంబాలు కలిసి విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించామని దీపక్ వెల్లడించారు.
Read Also: Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు
అయినా కూడా తమ కుటుంబం వికాస్ ఫ్యామిలీకి మరో 10 లక్షలు రూపాయలు ఇచ్చిందని మృతురాలి సోదరుడు దీపక్ చెప్పాడు. అప్పటికీ వరకట్న వేధింపులు ఆగలేదని చెప్పుకొచ్చాడు. కాగా.. కట్నం వేధింపులు ఇటీవలే నెక్ట్స్ లెవల్కి వెళ్లాయి. వికాస్ కుటుంబం.. ఒక ఫార్చ్యునర్ తో పాటు 21 లక్షల రూపాయలను కట్నం కింద డిమాండ్ చేయడం మొదలు పెట్టింది అని అతడు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు వికాస్ తో పాటు అతడి కుంటుంబ సభ్యులు కొడుతున్నట్లు మృతురాలు కరిష్మ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఇక, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన కరిష్మ అత్తగారి ఇంటికి రావడంతో అప్పటికే ఆమె విఘత జీవిగా పడి ఉంది. వికాస్, అతని తల్లిదండ్రులే వరకట్నం కోసం తమ బిడ్డను కొట్టి చంపేశారని కరిష్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!