Man kills wife: కట్నంగా ఫార్చ్యునర్ కారు ఇవ్వలేదని.. భార్యను చంపేసిన భర్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్ కారుతో పాటు 21 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చంపేశారు. గ్రేటర్ నోయిడాలోని ఖాడా చౌగన్పూర్ అనే గ్రామంలో నివాసం ఉండే వికాస్ అనే వ్యక్తికి.. 2022 డిసెంబర్ లో కరిష్మ అనే మహిళతో పెళ్లి అయింది. అప్పుడు కట్నం కింద వికాస్ కుటుంబానికి 11లక్షల రూపాయల క్యాష్ తో పాటు ఒక ఎస్యూవీ కారుని కరిష్మ తల్లిదండ్రులు ఇచ్చారు.
Read Also: RCB vs LSG Dream 11 Prediction: బెంగళూరు, లక్నో డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కానీ, పెళ్లి తర్వాత కూడా కట్నం గురించి కరిష్మను వికాస్ కుటుంబ సభ్యులు వేధించడం మొదలు పెట్టారు. ఇక, కరిష్మ సోదరుడు దీపక్ మాట్లాడుతూ..వికాస్ కుటుంబం అనేకసార్లు నా సోదరిని భౌతికంగా, మానసికంగా హింసించారు అని పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితం వికాస్-కరిష్మలకు ఆడ బిడ్డ పుట్టింది.. ఇక, అప్పటి నుంచి కట్నం వేధింపులు మరింత పెరిగాయన్నాడు. ఈ వ్యవహారం స్థానిక పంచాయతీ పెద్దల దృష్టికి కూడా వెళ్లాం.. రెండు కుటుంబాలు కలిసి విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించామని దీపక్ వెల్లడించారు.
Read Also: Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు
అయినా కూడా తమ కుటుంబం వికాస్ ఫ్యామిలీకి మరో 10 లక్షలు రూపాయలు ఇచ్చిందని మృతురాలి సోదరుడు దీపక్ చెప్పాడు. అప్పటికీ వరకట్న వేధింపులు ఆగలేదని చెప్పుకొచ్చాడు. కాగా.. కట్నం వేధింపులు ఇటీవలే నెక్ట్స్ లెవల్కి వెళ్లాయి. వికాస్ కుటుంబం.. ఒక ఫార్చ్యునర్ తో పాటు 21 లక్షల రూపాయలను కట్నం కింద డిమాండ్ చేయడం మొదలు పెట్టింది అని అతడు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు వికాస్ తో పాటు అతడి కుంటుంబ సభ్యులు కొడుతున్నట్లు మృతురాలు కరిష్మ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఇక, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన కరిష్మ అత్తగారి ఇంటికి రావడంతో అప్పటికే ఆమె విఘత జీవిగా పడి ఉంది. వికాస్, అతని తల్లిదండ్రులే వరకట్నం కోసం తమ బిడ్డను కొట్టి చంపేశారని కరిష్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!