Hyderabad Crime: కామాంధుల ఘాతుకం.. మహిళపై ఇద్దరు అత్యాచారం, తీవ్ర రక్తస్రావంతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: ప్రస్తుతం సమాజంలో చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు కొందరు కీచకులు ఎక్కడో ఓ చోట వేధిస్తూనే ఉన్నారు. తమ కామ కోరికలను తీర్చుకునేందుకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే, ఈ విధమైన లైంగిక చర్యలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కామాంధుల ఘాతుకాని ఓ మహిళ బలి అయింది. ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Read Also: Punjab : కడుపులో కవలలు.. భార్యను మంచానికి కట్టి సజీవ దహనం చేసిన భర్త
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
పోలీసుల కథనం ప్రకారం… ఓ మహిళ మృతదేహం కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఏఆర్ పైప్ వర్క్షాపు సెల్లార్లో పడి ఉండడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహం రక్తంలో ఉండడంతో, అత్యాచారం చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేసిన పోలీసులు అత్యాచారానికి గురై మృతిచెందిందని గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వైన్ షాపు వద్ద రోడ్డుపై ఓ మహిళ మూసాపేటకు వెళుతుండగా.. బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆమెను ఒకరు చేతులు, మరొకరు కాళ్లు పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న ఏఆర్ పైప్ వర్క్ సెల్లార్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. తిరిగి అదే బైక్పై కూకట్పల్లి వైపు వెళ్లినట్లుగా పోలీసులు సీసీ ఫుటేజీలో గమనించారు. అక్కడ ఉన్న సెల్లార్ చాలా లోతుగా ఉండటంతో రోడ్డుపై నుంచి చూసినా ఎవరికీ కనిపించదని వారు గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన మహిళ కూలీ పనిచేస్తూ కల్లు తాగుతూ తిరిగేదని తెలిసింది. మృతురాలికి భర్త, పిల్లలు లేనట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!