భారత స్పిన్నర్ల మాయాజాలంతో టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ను 68 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించడానికి రంగంలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ చేతులెత్తేయడంతో 16.3 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. టీమిండియా ఫైనల్స్కు చేరింది. ఈ ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి గెలిచారు. నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 1,37, 603 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రేకు 5,17,424 ఓట్లు రాగా, నితిన్ గడ్కరీకి 6,55,027 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి యోగేశ్ లంజేవార్ 19,242 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. నోటాకు 5,474 ఓట్లు వచ్చాయి.
లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రాబల్యం తగ్గుతోంది. 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయపతాకం ఎగురవేశారు. 1957 లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. కానీ 2019లో ఈ సంఖ్య కేవలం నలుగురు స్వతంత్ర ఎంపీలకు తగ్గింది. దేశంలో అత్యల్ప స్వతంత్ర ఎంపీల సంఖ్య 2014లో కేవలం ముగ్గురు మాత్రమే నిలిచారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు ఓటర్లకు డబ్బులు చూపి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో…
మోడీ మారోసారి ప్రధాని అవుతారని.. అందుకు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఐపీఎల్ ముగియగానే టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ 2024 ఆడనుంది. అందుకు సంబంధించి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. కాగా.. ఏప్రిల్ 28 లేదా 29న భారత…
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జోరం పీపుల్స్ మూవ్మెంట్) ఘనవిజయం సాధించింది. ఈసారి అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అందరు భావించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 40 సీట్లున్న అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పిఎం) 27 సీట్లను గెలుచుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 20 స్థానాల్లో గెలువగా, 45 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఒకవైపు.. ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి చెందారు.. కానీ, మంత్రి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం బోణి కొట్టింది. చార్మినార్ నుంచి ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్ అలీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై అలీ గెలుపొందారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఫలితం వచ్చింది. ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు 18వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు.