Manda Krishna Madiga: మోడీ గెలుపునకు కృషి చేస్తా..
మోడీ మారోసారి ప్రధాని అవుతారని.. అందుకు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజమైన ఎస్సీలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. శ్రీహరి నిజమైన ఎస్సీ కాదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. నకిలీ ఎస్సీ రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారన్నారు.. మరీ ఇప్పుడు నిజమైన ఎస్సీ కాదంటూనే కాంగ్రెస్ శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్ సభ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుబట్టారు.
READ MORE: Chhattisgarh : విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకున్న పేరెంట్స్.. కూతురిపై కోర్టు కీలకవ్యాఖ్యలు
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
అన్ని రాజకీయ పార్టీలు కులమతాలకతీతంగా అజెండాలో లేని అంశాలను ముందుకు తీసుకెళ్లాలనని విజ్ఞప్తి చేశారు. దశల వారీగా ఎస్సీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని బీజేపీ హామీ ఇవ్వడంతో మందకృష్ణ మాదిగ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!