నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు ఓటర్లకు డబ్బులు చూపి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది.. అంతిమ విజయం ప్రజలదే..
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని డీకే అరుణ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చెప్పకుండా.. తనపై వ్యక్తిగత దూషణలు చేశారని తెలిపారు. ఒక మహిళ అని కూడా చూడకుండా తనను కించ పరిచారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు అనేక రకాలుగా తనపై దూషణలు చేశారని ఆరోపించారు. ఒక మహిళ ఎంపీ స్థానంలో పోటీ చేస్తే ప్రజాదరణ తట్టుకోలేక తనను ఓడించేందుకు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో ప్రజలను నుండి తీవ్ర ఆసంతృప్తి కొని తెచ్చుకుందని తెలిపారు. నరేంద్ర మోడీ అభివృద్ధి పనులను చూసి దేశ భవిష్యత్ కోసం.. గ్రామ గ్రామాన యువకులు, మహిళలు, వృద్దులు బీజేపీకి ఓటేసి మద్దతు తెలిపారన్నారు.
Read Also: Viral Video: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ఇళ్లు తుడిచే కర్రతో గ్రిల్డ్ చికెన్ తయారీ..