బెంగాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ 24 పరగణాలులో పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో భారీగా బలగాలు మోహరించారు. అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Waqf Act: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. ఆందోళనల్లో పాల్గొన్న 150కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్లోని ముర్షిదాబాద్లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్షాప్లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
Pune: పూణేలోని హండేవాడి ప్రాంతంలో ఆడ కుక్కపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వ్యక్తిని పశ్చిమ బెంగాల్కి చెందిన అలీముద్దీన్ అమినల్ షేక్గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మార్చి 26న జరిగింది. ఈ విషయానికి సంబంధించి కుక్క యజమాని చంద్రశేఖర్ యాదవ్ కలేపడల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా షేక్ని అరెస్ట్ చేశారు.
BJP: వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గుంపు హింసకు పాల్పడుతోంది. ఇటీవల ముర్షిదాబాద్, మాల్దాలో ఇలాంటి ఘటనలే జరిగాయి, రాళ్లదాడితో పాటు వాహనాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి.
పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ముర్షిదాబాద్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. నిరసనకారులు రాళ్లు రువ్వి.. పోలీస్ వాహనాలు తగలబెట్టారు.
TMC: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, కీర్తి ఆజార్ మధ్య వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, బీజేపీ నేత అమిత్ మాల్వియా వీరి మధ్య గొడవల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పరిస్థితి విషమించడంతో తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
Waqf protest: వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరసనల పేరుతో అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడుతున్నారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్ష నెలకొంది. ఈ ప్రాంతంలో కీలకమైన రహదారిని అడ్డుకోకుండా పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Supreme Court: మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఉపశమనం కలిగించింది. 2022లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రిక్రూట్మెంట్ కోసం సూపర్న్యూమరీ లేదా అదనపు పోస్టుల సృష్టిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు (ఏప్రిల్ 8న) రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది.. నేను మాట్లాడిన తీరుపై తనను జైలులో వేసే ఛాన్స్ ఉంది.. ఎవరైనా తనకు సవాల్ విసిరితే.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాటకు నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను అన్నారు.. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు చేజారకుండా చూస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.