Sharmishta Panoli: శర్మిష్ట పనోలికి బిగ్ షాక్.. బెయిల్ తిరస్కరించిన హైకోర్టు
- శర్మిష్ఠ పనోలీ మధ్యంతర బెయిల్ను నిరాకరించిన కోల్కతా హైకోర్టు..
- శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన ఉన్నతస్థాయి న్యాయస్థానం..
- 14 రోజుల పాటు శర్మిష్ఠ పనోలీని జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించిన హైకోర్టు..
Sharmishta Panoli: పూణేకు చెందిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీకు కోల్కతా హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆపరేషన్ సింధూర్పై సినీ ప్రముఖులు మౌనం వహించడంపై శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఇదేనా అని ప్రశ్నించింది.
Read Also: IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
అయితే, వాక్ స్వాతంత్ర్యం సంపూర్ణం కాదు.. మతపరమైన వ్యాఖ్యలతో ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఈ హక్కు వీలు కల్పించలేదని గుర్తు పెట్టుకోవాలని కోల్కతా హైకోర్టు సూచించింది. శర్మిష్టకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా ఆమె వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ, ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడటం దాని అర్థం కాదు అని పేర్కొనింది. మన దేశం వైవిధ్యభరితమైంది.. అనేక కులాల, మతాల ప్రజలు ఇక్కడ కలిసి జీవనం కొనసాగిస్తున్నారని తెలిపింది. అలాంటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని కోల్కతా హైకోర్టు వెల్లడించింది.
Read Also: Minister Savitha: జగన్.. రౌడీ షీటర్లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే..
కాగా, శర్మిష్ఠ పనోలీకి మధ్యంతర బెయిల్ మంజూరుకు నిరాకరించిన న్యాయస్థానం.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే, ఉగ్రవాదులు పహల్గాంలో పురుషులపై జరిపిన మారణహోమం తర్వాత ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్పై కొందరు బాలీవుడ్ ప్రముఖుల సైలెంట్ గా ఉండటాన్ని ప్రశ్నిస్తూ మే 14వ తేదీన శర్మిష్ఠ సోషల్ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె పోస్టుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత తన పోస్టులు, రీల్స్ తొలగించిన తర్వాత ఆమె క్షమాపణలు కూడా చెప్పుకొచ్చింది. అనంతరం శర్మిష్ఠను కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!