West Bengal: మేనల్లుడిని చంపిన అత్త.. అసలు కథేంటంటే..!
- పశ్చిమ బెంగాల్లో దారుణం
- మేనల్లుడిని చంపిన అత్త
- అసలు కథేంటంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఒక మహిళ.. తన మేనల్లుడిని ముక్కలు.. ముక్కలుగా నరికి.. అవశేషాలను సిమెంట్ గోడలో వేసి కప్పేసింది. బాధితుడి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: IPL 2025 FINAL: అందరి టార్గెట్ ఒక్కడే..
Also Read
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాకు చెందిన మౌమిత అనే మహిళ తన మేనల్లుడు సద్దాం నాదాబ్తో సంబంధం కొనసాగిస్తోంది. మే 18 నుంచి సద్దాం జాడ కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మౌమితను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. సద్దాంను చంపేసి.. శరీరాన్ని మూడు ముక్కలుగా చేసి తన తండ్రి ఇంట్లో సిమెంట్లో వేసి మూసేసినట్లు తెలిపింది. పోలీసులు.. దినాజ్పూర్ జిల్లాలోని తపన్ ప్రాంతంలోని ఇంటి నుంచి ప్లాస్టిక్ మరియు కాంక్రీటుతో చుట్టబడిన సద్దాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Yashaswini Reddy: కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. కారణం ఏంటంటే?
బాధితుడు సద్దాం లేబర్ కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. లక్షల రూపాయుల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. మే 18న స్కూటర్పై ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అయితే అతడు మాల్డాలో ఉంటున్న అత్త మౌమితా హసన్ నదాబ్తో సంబంధం పెట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి పని చేయడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే సద్దాం.. ఫొటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అందుకే చంపేసినట్లు మౌమిత పోలీసులకు చెప్పింది. కానీ డబ్బుల వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడి దగ్గర లక్షల రూపాయులు ఉన్నాయని.. ఈ డబ్బు విషయంలోనే సద్దాం హత్యకు గురై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. మౌమిత భర్తను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!