Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు..
- దేశంలో మరోసారి మోగిన ఎన్నికల నగారా..
- గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లోని ఐదు స్థానాల్లో బైపోల్స్..
- జూన్ 19వ తేదీన పోలింగ్.. జూన్ 23న ఎన్నికల ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bypolls 2025: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. తాజాగా, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 19వ తేదీన ఆయా నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టానున్నారు.
Read Also: Cuts Off Private Part: భర్త ప్రైవేట్ పార్ట్ కోసిన భార్య… ఆపై యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం..!
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
అయితే, గుజరాత్లోని రెండు అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరగనుండగా, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్లలోని ఒక్కొక్క అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక, గుజరాత్లో, సిట్టింగ్ ఎమ్మెల్యే కర్సన్ భాయ్ పంజాభాయ్ సోలంకి మరణించడంతో కాడి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అలాగే, సిట్టింగ్ ఎమ్మెల్యే భయానీ భూపేంద్ర భాయ్ గండుభాయ్ రాజీనామాతో రాష్ట్రంలోని విశావదర్ స్థానానికి మరోసారి ఎన్నిక జరగబోతుంది.
Read Also: Adah Sharma : బాలీవుడ్ నెపోటిజంపై.. అదా శర్మ కామెంట్స్ వైరల్
ఇక, కేరళలోని పీవి అన్వర్ రాజీనామాతో నీలంబర్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది. సిట్టింగ్ సభ్యుడు గురుప్రీత్ బస్సీ గోగి మరణించడంతో పంజాబ్లోని లూథియానా స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించబోతుంది ఈసీ. అలాగే, బెంగాల్లోని కలిగంజ్ అసెంబ్లీ స్థానానికి కూడా బై ఎలక్షన్ జరగనుంది. అయితే, ఇండియా కూటమి మిత్రపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో భాగస్వామ్యం లేకుండా విశావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు సొంతంగా పోటీ చేయబోతున్నామని గుజరాత్ పీసీసీ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ గతంలో ప్రకటించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నామినేషన్ల ప్రక్రియ మే 26వ తేదీన ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ జూన్ 2. నామినేషన్ల పరిశీలన జూన్ 3వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 5వ తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
తాజావార్తలు
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!