Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు..
- దేశంలో మరోసారి మోగిన ఎన్నికల నగారా..
- గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లోని ఐదు స్థానాల్లో బైపోల్స్..
- జూన్ 19వ తేదీన పోలింగ్.. జూన్ 23న ఎన్నికల ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bypolls 2025: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. తాజాగా, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 19వ తేదీన ఆయా నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టానున్నారు.
Read Also: Cuts Off Private Part: భర్త ప్రైవేట్ పార్ట్ కోసిన భార్య… ఆపై యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం..!
Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
అయితే, గుజరాత్లోని రెండు అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరగనుండగా, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్లలోని ఒక్కొక్క అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక, గుజరాత్లో, సిట్టింగ్ ఎమ్మెల్యే కర్సన్ భాయ్ పంజాభాయ్ సోలంకి మరణించడంతో కాడి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అలాగే, సిట్టింగ్ ఎమ్మెల్యే భయానీ భూపేంద్ర భాయ్ గండుభాయ్ రాజీనామాతో రాష్ట్రంలోని విశావదర్ స్థానానికి మరోసారి ఎన్నిక జరగబోతుంది.
Read Also: Adah Sharma : బాలీవుడ్ నెపోటిజంపై.. అదా శర్మ కామెంట్స్ వైరల్
ఇక, కేరళలోని పీవి అన్వర్ రాజీనామాతో నీలంబర్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది. సిట్టింగ్ సభ్యుడు గురుప్రీత్ బస్సీ గోగి మరణించడంతో పంజాబ్లోని లూథియానా స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించబోతుంది ఈసీ. అలాగే, బెంగాల్లోని కలిగంజ్ అసెంబ్లీ స్థానానికి కూడా బై ఎలక్షన్ జరగనుంది. అయితే, ఇండియా కూటమి మిత్రపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో భాగస్వామ్యం లేకుండా విశావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు సొంతంగా పోటీ చేయబోతున్నామని గుజరాత్ పీసీసీ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ గతంలో ప్రకటించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నామినేషన్ల ప్రక్రియ మే 26వ తేదీన ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ జూన్ 2. నామినేషన్ల పరిశీలన జూన్ 3వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 5వ తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
తాజావార్తలు
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!