Murshidabad Riots: ముర్షిదాబాద్ అల్లర్లు.. తండ్రీకొడుకుల హత్యలో 13 మంది నిందితులు..
- ముర్షిదాబాద్ అల్లర్లలో తండ్రికొడుకుల హత్యపై చార్జిషీట్..
- 13 మంది నిందితుల పేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murshidabad Riots: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ‘‘వక్ఫ్ చట్టానికి’’ వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో తీవ్ర మత ఘర్షణలు జరిగాయి. ఆందోళన నిర్వహించిన ముస్లిం గ్రూపులో కొందరు వ్యక్తులు హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. హిందువుల ఆస్తులపై దాడులు చేశారు. ఈ అల్లర్లపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ బృందం కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అల్లర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని, అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, ముఖ్యంగా టీఎంసీ నాయకుడు మెహబూబ్ ఆలం ఈ అల్లర్లలో ప్రధాన నిందితుడిగా తేల్చింది.
Read Also: SVSN Varma : పవన్ కల్యాణ్ చెప్పినా మారరా.. ఇసుక మాఫియాపై వర్మ కామెంట్స్..
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
ఈ అల్లర్లలో తండ్రీకొడుకులను హత్య చేసిన కేసులో 13 మందిపై బెంగాల్ పోలీసులు చార్జిసీట్ దాఖలు చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన మత హింసలో హరగోబిందో దాస్ (74), అతని కుమారుడు చందన్ దాస్ (40)లను నరికి చంపారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత షంషేర్గంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జట్బోజా గ్రామంలోని బాధితుల ఇంటి తలుపులు పగలగొట్టి, వీరిని బయటకు లాగి పట్టపగలు నరికి చంపారు.
ఈ దాడి స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత, ధులియాన్ మునిసిపాలిటీ మాజీ చైర్మన్ మెహబూబ్ ఆలంపై హైకోర్టు నిజనిర్ధారణ తేల్చింది. నిందితులపై అల్లర్లకు పాల్పడటం, బలవంతంగా ఇంట్లోకి చొరబడటం, ఐదుగురికి పైగా వ్యక్తుల బృందం హత్య చేయడం, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని అక్రమంగా కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ఏప్రిల్ 8 నుండి 12 వరకు జరిగిన అల్లర్లలో ముగ్గురు మరణించారు, అనేక మంది గాయపడ్డారు, వందలాది మంది తమ ఇళ్లను పొరుగున ఉన్న మాల్డా జిల్లాకు పారిపోయారు. హింసకు సంబంధించి 300 మందిని అరెస్ట్ చేశారు. ఈ హింసాకాండపై ముర్షిదాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!