8 Dead, Several Missing During Idol Immersion: విజయదశమి పండగపూట విషాదం నెలకొంది. దుర్గా మాత విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి భక్తులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. మరికొంత మంది గల్లంతు అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లా మల్బజార్ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది.
ఓవైపు తగిన పిల్ల దొరకక పెళ్లికాని ప్రసాదులు ఎంతో మంది ఉన్నారు.. ఏళ్ల తరబడి పెళ్లి కోసం నిరీక్షించేవాళ్లు లేకపోలేదు.. మరోవైపు, నిత్య పెళ్లి కొడుకులు.. నిత్య పెళ్లి కూతుళ్ల వ్యవహారాలు కూడ బయటపడుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఓ యువకుడి వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది.. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండడని ఓ యువకుడు.. ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు… ఎంతటి ఘనుడైనా.. ఎక్కడో ఒకదగ్గర చిక్కకపోడు కదా.. ఓ యువతి ఫిర్యాదుతో మన కేడీ…
కన్నవారింటికి వెళ్లొద్దన్నారనే కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. మామ మర్మాంగాలను కోసిపడేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని మైనా జిల్లాలో చోటుచేసుకుంది.
Mithun Chakraborty comments on TMC: బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)పై విమర్శలు గుప్పించారు. గత జూలైలో మిథున్ చక్రవర్తి.. టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. తాను జూలైలో చేసి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిథున్ చక్రవర్తి అన్నారు. టీఎంసీకి చెందిన 38…
Crime: రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతోంది. చిన్నా, పెద్దా అని తేడా లేదు కామాంధులకు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో మూడేళ్ళ బాలికను డిజిటల్ రేప్ చేసిన 75 ఏళ్ళ వృద్దుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది న్యాయస్థానం.
ప్రధానిపై మోడీపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కానీ బెంగాల్ అసెంబ్లీలో మోడీకి మద్దతుగా మాట్లాడడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. నందిగ్రామ్లోని ఓ సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బీజేపీ తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. నడి రోడ్లపై రాళ్లు రువ్వడం, కట్టెలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకుని దాడి చేయడం వంటివి చాలా చోట్ల కనిపించాయి.
Nabanna Abhiyan march in west bengal: పశ్బిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. 2021 ఎన్నికల తర్వాత బీజేపీ మంగళవారం ‘నబన్న అభియాన్’ పేరుతో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కోల్కతా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అడ్డుకున్నారు.