West Bengal: టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు.. మిథున్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు..
Mithun Chakraborty comments on TMC: బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)పై విమర్శలు గుప్పించారు. గత జూలైలో మిథున్ చక్రవర్తి.. టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. తాను జూలైలో చేసి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిథున్ చక్రవర్తి అన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని..వారిలో 21 మంది నేరుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నారని చెప్పారు.
గతంలో నేను చేసిన వ్యాక్యలపై నిలబడతానని.. అయితే కొంత సమయం వేచి ఉండండి.. మీరే చూస్తారని చేరికల గురించి అన్నారు. టీఎంసీ నాయకులను చేర్చుకోవడంపై పార్టీలో అభ్యంతరం ఉందని వెల్లడించారు. చాలా మంది బీజేపీ నాయకులు కుళ్లిన బంగాళాదుంపలను తీసుకోమని టీఎంసీ నాయకుల గురించి అంటున్నారని మిథున్ చక్రవర్తి అన్నారు. దీనికి ముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఆరు నెలల్లో టీఎంసీ అధికారం కోల్పోతుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ అవినీతిపై విచారణ జరుపుతున్నాయని.. టీఎంసీ డిసెంబర్ లోపు అధికారాన్ని కోల్పోతుందని గతంలో మేదినీపూర్ లో సువేందు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read Also: Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గృహనిర్బంధం?.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు
ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తరుపున స్టార్ క్యాంపెనర్ గా ఉన్నారు మిథున్ చక్రవర్తి. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మెజారిటీ సీట్లను సాధించింది. మరోసారి మమతా బెనర్జీ సీఎం పదవిని చేపట్టారు. మొత్తం 294 స్థానాల్లో టీఎంసీ 213 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 77 సీట్లను సాధించింది. ఎన్నికల అనంతరం బెంగాల్లో భారీగా హింస చెలరేగింది. టీఎంసీ, బీజేపీ నాయకులే టార్గెట్ గా దాడులు, హత్యలకు పాల్పడ్డారు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 23న మాల్డాలోని మాలతీపూర్ ప్రాంతంలో మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మౌసుమీ దాస్ ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారుని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యాక్యలను టీఎంసీ తోసిపుచ్చింది. బీజేపీ నేతలే.. తమపై దాడులకు పాల్పడుతున్నారని టీఎంసీ అధికార ప్రతినిధి షువోమోయ్ బసు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
-
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!