West Bengal: దుర్గా నిమజ్జనంలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8 Dead, Several Missing During Idol Immersion: విజయదశమి పండగపూట విషాదం నెలకొంది. దుర్గా మాత విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి భక్తులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. మరికొంత మంది గల్లంతు అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లా మల్బజార్ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది.
మాల్ నదీలో దుర్గా మాత విగ్రహం నిమజ్జనం కోసం వందలాది మంది గుమిగూడారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మాల్ నదీ ప్రవాహం పెరిగింది. ఊహించని విధంగా మెరుపు వరద సంభవించడంతో చాలా మంది కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. చాలా మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. దాదాపుగా 50 మందిని ఈ వరదల నుంచి రక్షించారు.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
Read Also: CM KCR: సీఎంగా ఉంటూనే.. దేశమంతా పర్యటిస్తా
అకాస్మత్తుగా, ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు కొట్టుకుపోయారని.. ఇప్పటి వరకు ఎనిమిది మందిని రక్షించామని జల్పాయిగురి కలెక్టర్ మౌమితా గోదారా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్, పోలీస్, స్థానిక రెవెన్యూ యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తప్పిపోయివ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా దుర్గా విగ్రహ నిమజ్జనం వేడుకలో విషాదం నెలకొంది. సికంద్రా పీఎస్ పరిధిలో 15 ఏళ్ల బాలుడు, న్యూ ఆగ్రా పీఎస్ పరిధిలో ఇద్దరు యువకులు యమునా నదిలో మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగినా మృతదేహాలు లభించలేదు.
Saddening news coming from Jalpaiguri as flash flood in Mal river during Durga Puja immersion swept away many people. Few deaths have been reported till now.
I request the DM of Jalpaiguri & @chief_west to urgently step up rescue efforts & provide assistance to those in distress. pic.twitter.com/4dZdm2WlLO— Suvendu Adhikari (@SuvenduWB) October 5, 2022
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!