Home
Warangal
Warangal News
-
‘విజయగర్జన’తో ప్రజల్లోకి వెళ్లనున్న టీఆర్ఎస్?
టీఆర్ఎస్ ఆవిర్భవించి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఆపార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 15న వరంగల్ శివారులో ‘విజయగర్జన’ పేరుతో టీఆర్ఎస్ భారీసభను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్నహాక సభను ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ… -
గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించిన ఆర్జీవీ !
సంచలనాలకు మరియు వివాదాలకు కెరాఫ్ అడ్రస్ రామ్గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఒక వివాదం పై వార్తల్లో నిలుస్తారు రామ్గోపాల్ వర్మ. అయితే.. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొండా చిత్రం కోసం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్జీవీ… వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో అమ్మవారికి మద్యం తాగించారు. అక్కడి సంస్కృతి ప్రకారం గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించారు. ఆ… -
భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ అధికారులు అప్రమత్తం…
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయానికి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి అని వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. బల్దియా కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన కమిషనర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ లను ఏర్పరు చేసారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయానికి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ లు ఆదేశించారు. నగరంలోని… -
ఆసక్తిరేపుతున్న ఆర్జీవీ వరంగల్ పర్యటన
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా పరిణామాలు ఆసక్తిరేకిస్తున్నాయి. ఓ సినిమా కోసం రాంగోపాల్ వర్మ వరంగల్ జిల్లాలో సీక్రెట్ గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్ ల పేరుతో సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ, మరో బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ తాజాగా వరంగల్ లోని ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొంతసేపు రహస్యంగా చర్చించారు. ఎల్బీ కళాశాలకు సంబంధించిన… -
వరంగల్ కాకతీయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ కలకలం
వరంగల్ కాకతీయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా, అధికారులు ఆంక్షలు విధించినా.. ర్యాగింగ్ కొనసాగుతోంది. జాతీయ కోటాలో సీటు సాధించిన మొదటి సంవత్సరం విద్యార్థిని.. తృతీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు, బట్టలూడదీసి ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది.బాధిత విద్యార్థి.. సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయాన్ని, రాజస్థాన్లో ఉన్న తమ కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు వైద్యకళాశాలకు వచ్చి, ర్యాగింగ్ చేసిన విద్యార్థులతో మాట్లాడారు. మరోవైపు.. రాష్ట్ర వైద్యశాఖ… -
వరంగల్ పెట్రోల్ దాడి కేసులో అనుమానాలు…!
నడిరోడ్డుపై పెట్రోల్ పోశారు.. నిప్పంటించారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టారు.. అరెస్ట్ చేశారు. అక్కడితో కేసు కంచికి చేరినట్టేనా? కీలకమైన సంస్థను, ఆ సంస్థ ప్రతినిధులను కేసు నుంచి తప్పించారా? రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయా? ఓరుగల్లు పెట్రోల్ దాడిపై జరుగుతున్న రచ్చేంటి? కేసులో చిట్ఫండ్ సంస్థను తప్పించారా? వరంగల్లో నడిరోడ్డుపై.. పట్టపగలు జరిగిన ఈ పెట్రోల్ దాడి ఓ పెను సంచలనం. చిట్టీలో పాడుకున్న డబ్బులు అడిగినందుకు రాజు అనే వ్యక్తిపై ఈ విధంగా పెట్రోల్… -
అయ్యో రేవంత్.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!
పాపం తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వాళ్లు ఒకటి తలిస్తే.. అధిష్టానం ఇంకోటి తలిచినట్టుంది. ఈ గ్రూపుల కొట్లాటలో.. తలదూర్చడం ఎందుకనుకున్నారో ఏమో కానీ.. ఇప్పట్లో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి.. ఈ నెల 8నే గజ్వేల్ లేదా.. నర్సాపూర్ నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించాలని ఆ పార్టీ భావించింది. ఆ తర్వాత 17న తెలంగాణ ఉద్యమ కేంద్రం వరంగల్ లో ముగింపు సభను… -
కడియం శ్రీహరి, రాజయ్య వర్గీయుల మధ్య ముదురుతున్న వివాదం
కడియం శ్రీ హరి మరియు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని కడియం శ్రీ హరి అన్నారు. అయితే… దీనికి కౌంటర్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని.. కేసీఆర్ తాను ఎలాంటి వరాలు అడిగినా ఇస్తారని పేర్కొన్నారు. అయితే… తాజాగా కడియం శ్రీ హరి మరియు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య… -
ముగ్గురు కాంగ్రెస్ నేతలపై నాన్ బెయిలబుల్ వారెంట్…
ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదయ్యింది. బలరాంనాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిపై ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది కోర్టు. వీరి పై హనంకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో కేసు నమోదయ్యింది. కానీ ఈ కేసు విచారణకు హాజరుకానందున ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి హాజరుపరచాలని కోర్టు తెలిపింది. అయితే ఎన్బీడబ్ల్యూ జారీతో కోర్టుకు హాజరయ్యారు బలరాం నాయక్. దాంతో బలరాంనాయక్పై… -
వరంగల్లోని ఇంటర్ ఆర్జేడీ ఆఫీస్ తరలింపుపై చర్చ!
అది తొమ్మిది జిల్లాలకు హెడ్ ఆఫీస్. నిన్న మొన్నటి వరకు ఆ శాఖకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదు కూడా. అలాంటిది ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది. దానికి రాజకీయ సెగ తగలడంతో ఒక్కటే చర్చ. ఇంతకీ ఆఫీస్ ఏంటి? ఎందుకు వివాదాస్పదంగా మారిందో ఈ స్టోరీలో చూద్దాం. ఇంటర్ విద్యలో 9 జిల్లాలకు వరంగల్ ఆర్వో ఆఫీస్ కేంద్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఇంటర్బోర్డులో మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తెలంగాణలోని వరంగల్లో…
తాజావార్తలు
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
-
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!