వరంగల్ పట్టణంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా వరంగల్ నగరానికి విచ్చేసిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆత్మీయ స్వాగతం పలికారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించికున్నారు జోగినపల్లి సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎం.పి సంతోష్ కుమార్, తూర్పు శాసనసభ్యులు నరేందర్, ఎంపీ దయాకర్, మేయర్ గుండు సుధారాణి…
వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది.. హన్మకొండలో చౌరస్తాలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిన గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుకున్నారు. హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హజరై, తిరిగి వచ్చే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది. బిల్డింగ్ యాజమాని నిపుణులను రప్పించి లిఫ్ట్ ని రిపేర్ చేయించారు. సుమారు 10 నిమిషాల పాటు మేయర్ సుధారాణి అందులోనే ఉండిపోయారు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో…
తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభలో తనను అవమానించారంటూ కమలాపూర్ ఎంపీపీ తడుక రాణి ఆందోళన దిగింది. అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఎంపీపీనైనా తనపై అసభ్య పదజాలంతో ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం…
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కిటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కిటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం ఇవాళ తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండీ సాబు జాకబ్, ఇతర సీనియర్ ప్రతినిధి బృందం… మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కేటీఆర్ వారికి వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా,…
కాంగ్రెస్ హైకమాండ్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను లైట్ తీసుకుందా? కొత్త పీసీసీలో ఎందుకు ప్రాధాన్యం కల్పించలేదు? పీసీసీ ఎంపిక ప్రక్రియ సమయంలో వినిపించిన పేర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పీసీసీలో చోటు కల్పిస్తారని ఆశించిన ఉమ్మడి వరంగల్ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి హేమాహేమీల్లాంటి నాయకులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు కండువా మార్చేసినా.. హస్తం శిబిరంలోనే ఉండిపోయిన సీనియర్లు అనేకమంది. మంత్రులుగా..…
హుజురాబాద్పై వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు ఫోకస్ పెట్టారా? ఆ నియోజకవర్గంలో వరస పర్యటనలు చేస్తున్నారా? ఉపఎన్నికలో ఓరుగల్లు అధికారాపార్టీ నాయకులే కీలకం కాబోతున్నారా? క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్! హుజురాబాద్లో మోహరించిన ఓరుగల్లు టీఆర్ఎస్ నేతలు తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గం హుజురాబాద్. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక రాబోతుంది. ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. అందుకే…
తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించారు.. ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అంటూ.. ఒకే పేరుతో రెండు జిల్లాలు ఉన్నాయి.. అయితే, వరంగల్ అర్బన్ను హన్మకొండ జిల్లాగా.. వరంగల్ రూరల్ను వరంగల్ జిల్లాగా మార్చనున్నట్టు వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వెలువడతాయని తెలిపారు.. వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఇవాళ వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యంత ఆధునిక వైద్య సేవలతో ఏర్పాటు చేయనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్, ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన భవనాలను ప్రారంభించనున్నారు. నేడు వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని కేసీఆర్ యాదాద్రికి చేరుకుంటారు. ఇప్పటికే యాదాద్రి నూతన ఆలయ పునర్నిర్మాణాల పనులను…