హుజురాబాద్ కు వరంగల్ నేతల క్యూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్పై వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు ఫోకస్ పెట్టారా? ఆ నియోజకవర్గంలో వరస పర్యటనలు చేస్తున్నారా? ఉపఎన్నికలో ఓరుగల్లు అధికారాపార్టీ నాయకులే కీలకం కాబోతున్నారా? క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్!
హుజురాబాద్లో మోహరించిన ఓరుగల్లు టీఆర్ఎస్ నేతలు
Also Read
తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గం హుజురాబాద్. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక రాబోతుంది. ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. అందుకే ఈ ఉపపోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. అక్కడ అన్ని విధాలుగా మోహరిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా నాయకులను రంగంలోకి దించి.. హుజురాబాద్లోని పార్టీ నాయకులు ఎవరూ జారిపోకుండా చర్యలు చేపట్టిందట.
వరంగల్ నేతలే కీలక భూమిక?
గులాబీపార్టీ పెద్దల ఆదేశాలతో వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బస్వరాజు సారయ్యలు అక్కడికి వెళ్లి ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హడావిడి చూసిన తర్వాత హుజురాబాద్ ఉపఎన్నికలో వరంగల్ నేతలే కీలక పాత్ర పోషిస్తారని కేడర్ భావిస్తోంది.
కమలాపూర్ మండలంపై చల్లా ధర్మారెడ్డి నజర్!
హుజురాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కీలకమైన మూడు మండలాలకు వరంగల్ జిల్లా నాయకులే ఇంఛార్జులుగా ఉంటున్నారట. అధిష్ఠానం ఆదేశాలతో అక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. హుజురాబాద్కు ఆనుకునే పరకాల సెగ్మంట్ ఉంటుంది. అందుకే ఈటల ఎపిసోడ్ మొదలుకాగానే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అక్కడ ఫోకస్ పెట్టారట. కమలాపూర్ మండల పరిధిలోని గ్రామాల్లో కార్యకర్తలతో నిరంతరం టచ్లో ఉంటున్నట్టు సమాచారం. పలు ధపాలుగా వారితో మాంతనాలు జరిపిట్టు తెలుస్తోంది.
జమ్మికుంటపై ఆరూరి రమేష్ ఫోకస్
వీణవంక మండలంలో పెద్ది సుదర్శన్ ప్రచారం
జమ్మికుంటకు ఆనుకుని ఉండే నియోజకవర్గం వర్ధన్నపేట. దీంతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జమ్మికుంటపై దృష్టి పెట్టారట. గతంలో కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్గా ఉన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం అక్కడ పర్యటిస్తున్నట్టు చెబుతున్నారు. వీణవంక మండలంలో మరో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారట. ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికపై మంత్రి హరీష్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్లు పూర్తిస్థాయిలో అక్కడి పార్టీ నేతలను గైడ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు హుజురాబాద్లో పనిచేస్తున్న ఓరుగల్లు టీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు టాక్.
ఈటల లక్ష్యంగా నేతల విమర్శలు..సవాళ్లు
ఎవరికి అప్పగించిన మండలాల్లో వారు పర్యటిస్తూనే రోజుకో ప్రెస్మీట్తో ఈటలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నాయకులు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పార్టీ అంశాలపైనా కౌంటర్లు.. సవాళ్లు విసురుతున్నారు. వారం పదిరోజుల్లో జిల్లాకు చెందిన మరో పదిమంది కీలక నాయకులు హుజురాబాద్ వెళ్తారని తెలుస్తోంది. గ్రామస్థాయి నుంచే టీఆర్ఎస్ గెలుపునకు వ్యూహ రచన చేస్తారని సమాచారం.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!