Bandi Sanjay: భద్రకాళి సన్నిధిలో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర.. భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది… మూడో విడతలో 11 నియోజకవర్గాలు, 5 జిల్లాల గుండా ఆయన పర్యటన సాగింది.. ఈ సారి 300.4 కిలోమీటర్లను చేరుకోవడంతో యాత్ర ముగియనుంది.. మొత్తంగా 3 విడతల్లో కలుపుకేంటే 1121 కిలోమీటర్లు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంజయ్ పాదయాత్ర సాగింది… వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు చేరుకోవడంతో మూడో విడత పాదయాత్ర ముగినుంది.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి.. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు బండి సంజయ్.. ఇక, అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు ఇద్దరు నేతలు.. ఇప్పటికే బీజేపీ తెలంగాణ ఇన్చార్జి సునీల్ బన్సల్ వరంగల్ చేరుకోగా.. మధ్యాహ్నానికి జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుని.. ఆ తర్వాత వరంగల్కు వెళ్లనున్నారు..
Read Also: What is The BJP Plan: ఎన్టీఆర్తో సరే..! నితిన్ ఎందుకు..? బీజేపీ ప్లాన్ అదేనా..?
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
అయితే, తొలి రెండు విడతల్లో ప్రజా సంగ్రామ యాత్ర ఎలాంటి అడ్డకుంటు లేకుండా సాగినా.. మూడో విడతలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు.. బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ఉధ్రిక్తతల మధ్య సాగింది.. అధికార టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు.. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. విడుదల చేసిన ఓ వీడియో సైతం.. సంజయ్ పాదయాత్రపై ప్రభావాన్ని చూపించింది.. ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు వర్దన్నపేట ఏసీపీ.. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని.. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని.. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని స్పష్టం చేశారు.. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
కానీ, బీజేపీ నేతలు మాత్రం తగ్గేదేలే అంటూ.. న్యాయపోరాటం చేసి పాదయాత్రకు అనుమతి సంపాదించారు.. మరోవైపు.. రాజాసింగ్ వ్యాఖ్యలతో పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. రాజాసింగ్, విడుదల.. మళ్లీ అరెస్ట్ చేయడం.. లాంటి ఘటనలు.. పాతబస్తీలో రాజాసింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. ఈ నేపథ్యంలో.. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగాల్సిన మూడో విడత ముగింపు బహిరంగ సభకు ఆటంకం ఏర్పడింది. తొలుత అనుమతి ఇచ్చినప్పటికీ.. పాతబస్తీలో టెన్షన్, పాదయాత్ర సమయంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం సభకు అనుమతి నిరాకరించింది.. పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు కాబట్టి.. సభకు అనుతి ఇవ్వలేమని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.. ఇక, దీనిపై పూడా బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో.. సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది హైకోర్టు.. దీంతో.. ఇవాళ హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ జరగనుంది. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడంపై దృష్టిసారించారు ఆ పార్టీ నేతలు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!