Warangal Modi Ganesh: వరంగల్ లో మోడీ గణపతి.. బీజేపీ నేత కొండంత అభిమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడంతా గణేష్ చవితి సందడి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గణేష్ విగ్రహాలను తెచ్చి మంటపాల్లో వుంచి పూజలు చేస్తున్నారు. వాడవాడలా గణేష్ పూజలతో హడావిడి చేస్తున్నారు భక్తులు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల గణపతి ఉత్సవ మూర్తులు భక్తులను ఆకర్షిస్తున్నాయి వరంగల్ ప్రజలు ఈ సంవత్సరం కాలుష్య రహిత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం నగర ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సాధ్యమయినంత వరకూ మట్టితో చేసే విగ్రహాలు చాలాచోట్ల కొలువయ్యాయి.
పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చేలా మట్టి గణపతి విగ్రహాలు నెలకొల్పారు. వివిధ రూపాలలో తయారుచేసిన గణపతి విగ్రహాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రెండ్ నడుస్తుంది. అందుకు తగ్గట్టుగా వరంగల్ జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి వెరైటీగా గణపతి విగ్రహాన్ని తయారుచేయించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గణపతిని భుజాలపై ఎత్తుకొని భూలోకానికి తీసుకొస్తున్న ప్రతిమ శివనగర్ లో భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నరేంద్ర మోడీపై ప్రేమతో ప్రత్యేకంగా వెరైటీ గణపతిని తయారు చేయించారని గణపతి తయారీదారులు అంటున్నారు. నరేంద్ర మోడీ వినాయకుడు ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. ఈ వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
వినాయక చవితి ఉత్సవాల్లో కొత్తదనానికి పెద్ద పీట వేశారు. వివిధ రూపాల్లో ప్రతిమలను ప్రతిష్టించేంచేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఈసారి వినాయక చవితి ఉత్సవాల్లో ట్రెండ్ కు తగ్గట్లుగా లంబోదరుడి విగ్రహాల తయారీకి సంబంధించి ముందుగా ఆర్డర్ తీసుకుని వివిధ రూపాలను తయారు చేసారు. వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు ప్రదానీ మోదీ రూపంలో ఉండే బొజ్జగణపతి విగ్రహం తయారు చేయించి మండపాల్లో ప్రతిష్టించారు. ఆ గణపతిని మండపానికి తరలించి.. …మండపాల్లో ప్రతిష్టించిన తరువాత పూజలు చేస్తామని ఉత్సవ కమిటీ నిర్వహకులు చెప్పారు.మోదీ రూపంలో గణనాథుడి విగ్రహం మట్టితో తయారు చేసామని..ఈ అవకాశం తమకు రావటం సంతోషంగా ఉందని తయారీ దారుడు రాజేందర్ చెబుతున్నారు.
Read Also: HariHara Veeramallu: ఫ్యాన్స్ సిద్ధంకండి.. పవర్ ప్యాక్డ్ టీజర్ లోడింగ్..
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!