Warangal Modi Ganesh: వరంగల్ లో మోడీ గణపతి.. బీజేపీ నేత కొండంత అభిమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడంతా గణేష్ చవితి సందడి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గణేష్ విగ్రహాలను తెచ్చి మంటపాల్లో వుంచి పూజలు చేస్తున్నారు. వాడవాడలా గణేష్ పూజలతో హడావిడి చేస్తున్నారు భక్తులు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల గణపతి ఉత్సవ మూర్తులు భక్తులను ఆకర్షిస్తున్నాయి వరంగల్ ప్రజలు ఈ సంవత్సరం కాలుష్య రహిత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం నగర ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సాధ్యమయినంత వరకూ మట్టితో చేసే విగ్రహాలు చాలాచోట్ల కొలువయ్యాయి.
పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చేలా మట్టి గణపతి విగ్రహాలు నెలకొల్పారు. వివిధ రూపాలలో తయారుచేసిన గణపతి విగ్రహాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రెండ్ నడుస్తుంది. అందుకు తగ్గట్టుగా వరంగల్ జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి వెరైటీగా గణపతి విగ్రహాన్ని తయారుచేయించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గణపతిని భుజాలపై ఎత్తుకొని భూలోకానికి తీసుకొస్తున్న ప్రతిమ శివనగర్ లో భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నరేంద్ర మోడీపై ప్రేమతో ప్రత్యేకంగా వెరైటీ గణపతిని తయారు చేయించారని గణపతి తయారీదారులు అంటున్నారు. నరేంద్ర మోడీ వినాయకుడు ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. ఈ వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
వినాయక చవితి ఉత్సవాల్లో కొత్తదనానికి పెద్ద పీట వేశారు. వివిధ రూపాల్లో ప్రతిమలను ప్రతిష్టించేంచేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఈసారి వినాయక చవితి ఉత్సవాల్లో ట్రెండ్ కు తగ్గట్లుగా లంబోదరుడి విగ్రహాల తయారీకి సంబంధించి ముందుగా ఆర్డర్ తీసుకుని వివిధ రూపాలను తయారు చేసారు. వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు ప్రదానీ మోదీ రూపంలో ఉండే బొజ్జగణపతి విగ్రహం తయారు చేయించి మండపాల్లో ప్రతిష్టించారు. ఆ గణపతిని మండపానికి తరలించి.. …మండపాల్లో ప్రతిష్టించిన తరువాత పూజలు చేస్తామని ఉత్సవ కమిటీ నిర్వహకులు చెప్పారు.మోదీ రూపంలో గణనాథుడి విగ్రహం మట్టితో తయారు చేసామని..ఈ అవకాశం తమకు రావటం సంతోషంగా ఉందని తయారీ దారుడు రాజేందర్ చెబుతున్నారు.
Read Also: HariHara Veeramallu: ఫ్యాన్స్ సిద్ధంకండి.. పవర్ ప్యాక్డ్ టీజర్ లోడింగ్..
తాజావార్తలు
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!