Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చివరకు నిరాశే ఎదురైంది. ట్రంప్ను కాదని వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు కొరినో మచాడోను ‘‘నోబెల్ శాంతి బహుమతి 2025’’ వరించింది. ఆమెకు నోబెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Russia: ఇటీవల కాలంలో రష్యా, పాకిస్తాన్ యుద్ధ విమానాలకు ఇంజన్లు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో కాంగ్రెస్, ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ప్రధాని మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపిస్తోంది. అయితే, వీటన్నింటిపై రష్యా క్లారిటీ ఇచ్చింది.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయ సినిమాల గురించి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. రష్యాలో ఇండియన్ సినిమాలకు చాలా ఆదరణ ఉందని చెప్పారు. ‘‘మేము భారతీయ సినిమాను ప్రేమిస్తున్నాము’’ అని సోచి నరగంలో జరిగిన వాల్డాయ్ చర్చ వేదికపై నుంచి పుతిన్ అన్నారు.
Putin: భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదు’’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ లాంటి చర్యల్ని అనుమతించరని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి. దక్షిణ రష్యాలోని సోచిలో…
India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు.
Putin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ప్రపంచంలోనే అత్యధికంగా 50 శాతం సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో, భారత్, చైనాలు గత ఘర్షణలను మరించి స్నేహంగా మెలగాలని నిర్ణయించుకున్నాయి. దీనికి ఇటీవల చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ-జిన్పింగ్-పుతిన్ ఉల్లాసంగా మాట్లాడుకుంటున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్గా మారింది.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా, ట్రంప్ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలకు మద్దతుగా నిలిచారు. ఈ రెండు దేశాలను యూఎస్ ఆంక్షల పేరుతో బెదిరించలేదని అన్నారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ అనంతరం మీడియాతో మాట్లాడిన పుతిన్..
Pakistan PM: చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి డ్రాగన్ కంట్రీ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. మోడీతో పుతిన్, జిన్పింగ్ దైపాక్షిక చర్చలు ప్రపంచవ్యాప్తంగా మీడియా హైలెట్ చేసింది. ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, భారత్, చైనాల మధ్య స్నేహ బంధం బలపడుతోంది. దీంతో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోడీ భేటీని కూడా అంతర్జాతీయ మీడియా హైలెట్ చేసింది.
Putin: చైనాలోని టియాంజిన్లో జరుగుతున్న 25వ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోడీ, చైనాలో పర్యటిస్తున్నారు. ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, ఈ సమావేశం జరుగుతుండటంతో ప్రపంచ దృష్టి అంతా ఈ సమావేశాలపైనే ఉంది.
SCO Summit: చైనాలో జరుగుతున్న SCO సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్లో భాగంగా ముందుగా నేతలతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. అనంతరం అన్ని దేశాధినేతలు సంయుక్తంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాంజిన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులపై…