India Russia: ‘‘యుద్ధంపై మోడీ, పుతిన్ చర్చించారు..’’ నాటో చీఫ్ వ్యాఖ్యలను తిరస్కరించిన భారత్..
- ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, పుతిన్ మాట్లాడారు..
- నాటో చీఫ్ వ్యాఖ్యల్ని ఖండించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు.
Also Read
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
అయితే, ఈ వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన వాదనను పూర్తిగా తిరస్కరించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక ప్రకటనలో.. NATO నాయకత్వం అటువంటి ప్రకటనలు చేసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ఎప్పుడూ జరగని సంభాషణలు” గురించి ఊహాజనిత వ్యాఖ్యలు “ఆమోదయోగ్యం కాదు” అని నొక్కి చెప్పింది.
“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగినట్లు చెబుతున్న ఫోన్ సంభాషణకు సంబంధించి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన ప్రకటనను మేము చూశాము. ఆ ప్రకటన వాస్తవంగా తప్పు, పూర్తిగా నిరాధారమైనది. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షుడు పుతిన్తో సూచించిన విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి సంభాషణ జరగలేదు” అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇంధన దిగుమతి నిర్ణయాలు తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!