ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. తాజాగా అమరావతి నుంచి ప్రారంభం అయిన ఉద్యమం విశాఖ సాగరతీరానికి చేరింది. విశాఖ జిల్లా స్ధాయిలోనూ ఉద్యోగ జేఏసీలు ఏకమయ్యాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటయినట్టు సమితి కన్వీనర్ ఈశ్వర్రావు తెలిపారు. ఈనెల 25 న బైక్ ర్యాలీతో నగరమంతా నిరసన తెలుపుతామంటున్నారు. ఫిబ్రవరి 3 న ఛలో విజయవాడ తలపెట్టామన్నారు. తమ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి వారి మద్దతు కూడగట్టుకుంటామన్నారు ఈశ్వరరావు. ఫిబ్రవరి 7 తేదీన…
విశాఖ జిల్లాలో సినిమా హాళ్ళలో కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో యజమానులు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వివిధ నిబంధనల పేరుతో థియేటర్లకు అధికారులు నోటీసులు జారీచేయడం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము థియేటర్లను నడపలేం అంటున్నారు యజమానులు. ఇప్పటికే కరోనా వల్ల దివాలా తీశామని, ప్రభుత్వం విధించే ఆంక్షలతో థియేటర్లు మూసివేయడమే శరణ్యం అంటున్నారు.
ఆ యువ ఎమ్మెల్యేకు హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చిందా.. లేక ఆశలకు కత్తెర వేసిందా? ఎమ్మెల్యే ఆశిస్తున్నదేంటి.. వచ్చిన పదవివల్ల కలిగే లాభనష్టాలేంటి? కేడర్లో భిన్నవాదనలెందుకు? ఏ విషయం వారికి అంతుబట్టడం లేదు? అమర్నాథ్కు పార్టీ పరంగా కీలక బాధ్యతలువిశాఖజిల్లాలో పార్టీ పటిష్టతపై YCP స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ అధికారపార్టీకి 11మంది శాసనసభ్యుల బలం ఉంది. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపించినా.. రెండున్నరేళ్లు తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేలకు…
చేనుకు పురుగు పడితే మందులు చల్లుతారు. కానీ అక్కడ పురుగు పడితే పండగ చేసుకుంటారు. పురుగులను వంట చేసుకొని తింటారు. పురుగులే వారికి జీవనాధారం. ఇదిగో ఇవే తెల్లటి పురుగులు గిరి పుత్రులకు ఎంతో ఇష్టమైన ఆహారం. ఆ పురుగులను తినడమే కాకుండా.. వాటిని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మన్యం రొయ్యగా వీటికి పేరుంది. విశాఖ ఏజెన్సీలో పూర్వకాలం నుండి ఈ పురుగులు తినడం గిరిపుత్రుల ఆహార శైలిలో ఓ భాగం. ప్రస్తుతం ఆ పురుగులను…
విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం కొలిక్కిరాలేదు. కలెక్టరేట్లో జరిగిన ఇరు వర్గాల చర్చలు విఫలం కావడంతో పంచాయితీ మొదటికొచ్చింది. రాజీ కుదిర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రింగ్ వలల వివాదంపై విశాఖ కలెక్టరేట్లో ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల మత్స్యకారుల సమావేశం జరిగింది. జీవో ప్రకారం వేట కొనసాగిస్తే… తమకు ఉపాధి దక్కడం కష్టమవుతుందని రింగ్ వలల మత్స్యకారులు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం రింగు వలల మత్స్యకారులు వేటకు…
రాష్ట్రంలో యువతలో దాగి వున్న అద్భుత మయిన ప్రతిభను, క్రీడా నైపుణ్యాలను బయటకు తీయడానికి అనేక చర్యలు చేసట్టామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. యువతలో ఉన్న ప్రతిభ బయటకు తీయడం కోసమే వైఎస్సార్ కప్ పోటీలు ప్రారంభించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నమెంట్ ప్రారంభించామన్నారు. ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతామని, గత ఏడాది 420 టీంలు పోటీల్లో పాల్గొన్నాయన్నారు. ఈ సారి 490 టీంలు పాల్గొన్నాయి. విశాఖను క్రీడా రాజధానిగా చేయడమే…
సుద్ద గని ఆ గ్రామానికి నిధి…తాతల నాటి నుండి కొన్ని కుటుంబాలకు జీవనోపాధి అదే. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో ముగ్గుకి ప్రాధాన్యత ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలో తెలతెలవారకముందే కళ్ళాపి జల్లి ముగ్గు వేయడం సనాతన ఆచారం. ముగ్గు పిండి తయారీకి పెట్టింది పేరైన బెన్నవోలులో ఇప్పుడేం జరుగుతోంది? విశాఖ జిల్లా చోడవరం మండలంలో మేలు రకం ముగ్గు పిండికి పెట్టింది పేరు బెన్నవోలు గ్రామం. గ్రామ సమీపంలో సుద్దగని కొండ ఉంది. ఈ గ్రామానికి చెందిన పల్లీలు…
వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH…
విశాఖలో మరోమారు మత్స్యకారుల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రింగు వలల వివాదంతో నగరంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వేల సంఖ్యలో గ్రామస్తులు వచ్చారు. రోడ్డుపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలు బాయ్కాట్ చేస్తున్నామని మత్స్యకార నాయకులు తెలిపారు. మత్స్యకారులు కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలు దేరగా అక్కడ మంత్రులు అప్పలరాజు, అవంతి వారితో చర్చలు జరిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విడిచిపెట్టే వరకు…
ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయం కొత్త కాదు.. కానీ, మరోసారి కులరాజకీయం తెరపైకి వస్తోంది.. తాము అంటే తామేనని ప్రకటిస్తున్నారు నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందన్న ఆయన.. కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే అని ప్రకటించారు.. ఇక, ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, బీజేపీల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయని చెప్పుకొచ్చారాయన.. భారతీయ జనతాపార్టీది సబ్ కా సత్ సబ్ కా వికాస్…