రింగు వలల వివాదం తీరేదెప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం కొలిక్కిరాలేదు. కలెక్టరేట్లో జరిగిన ఇరు వర్గాల చర్చలు విఫలం కావడంతో పంచాయితీ మొదటికొచ్చింది. రాజీ కుదిర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రింగ్ వలల వివాదంపై విశాఖ కలెక్టరేట్లో ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల మత్స్యకారుల సమావేశం జరిగింది.
జీవో ప్రకారం వేట కొనసాగిస్తే… తమకు ఉపాధి దక్కడం కష్టమవుతుందని రింగ్ వలల మత్స్యకారులు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం రింగు వలల మత్స్యకారులు వేటకు చేసుకుంటే తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు సంప్రదాయ మత్స్యకారులు. అలాకాకుండా ఎనిమిది కిలోమీటర్ల ఇవతల వేట చేస్తామంటే తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటున్నారు.
Also Read
ప్రస్తుతం మత్స్యకార గ్రామాలలో అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు ఇరు వర్గాలు. పండగ ముందు వేట చేయకపోతే… తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు నిబంధనల ప్రకారమే రింగు వలల మత్స్యకారులు వ్యవహరించాలని సూచించారు ఫిషరీస్ జేడీ లక్ష్మణరావు. మరోసారి ఇరువర్గాలతో పండుగ అనంతరం చర్చలు జరుపుతామన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 144 సెక్షన్ పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరి ఈవివాదం ఎప్పుడు కొలిక్కి వస్తోందో చూడాలి.
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!