విశాఖపట్నం ఆర్కే బీచ్లో అదృశ్యమైన, ప్రియుడిని పెళ్లాడి ప్రత్యక్షమైన సాయిప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది… భర్త కన్నుగప్పి ప్రియుడితో వెళ్లిపోయింది సాయిప్రియ.. కానీ, ఆ విషయం తెలియన ఆమె భర్త శ్రీనివాస్.. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందని భావించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో, పోలీసులు, నేవీ, సముద్రతీరంలో గస్తీ దళం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.. కానీ, పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.. ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె.. అతడిని పెళ్లి…
సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారు.. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు 25వేల మందితో 25 కిలోమీటర్ల మెగా క్లీనప్ డ్రై వ్ లో పాల్గోనున్నారు. నగరానికి మణిహారమైన సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగింపును యజ్ఞంగా చేపట్టింది విశాఖ జిల్లా అధికార యంత్రాంగం.. 25వేల మంది భాగస్వామ్యంతో… 25కిలోమీటర్ల పొడవున మెగా బీచ్ క్లీనప్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రయత్నం గిన్నీస్ రికార్డ్ నెలకోల్పో దిశగా జరుగుతోంది. ఫిషింగ్…
ప్రధాన నరేంద్ర మోడీని కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలని ఆహ్వానించారు.. ఈరోజు ఆయన కార్యాలయంలో ప్రధాని మోడీని కలిశారు రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు… అనేక ప్రతిష్టాత్మకమైన జాతీయ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్బంగా ప్రధానికి జీవీఎల్ స్వయంగా అందచేసిన లేఖలో విశాఖపట్నంలో పూర్తికానున్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రస్తావించారు.. వాటిపై ప్రధాని…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. విశాఖలో వైసీపీ నేతలు గంటకో ఘోరం, అరగంటకో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన.. 420 పార్టీలో విజయసాయిరెడ్డి, కొడాలి నాని లాంటి వాళ్లు 840లు అంటూ ఎద్దేవా చేశారు.. విశాఖలో వృద్ధాశ్రమ భూముల్నీ వైసీపీ నేతలు వదలట్లేదని విమర్శించారు.. విశాఖలో వైసీపీ సాగించిన భూ కబ్జా బాధితుల కోసం ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు…
అంబానీ, ఆదానీల చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని సగర్వంగా ప్రకటించారు. దేవుడి దయతో ఒక పరిశ్రమ…
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇక, రెండో ఫేజ్ పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు.. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.1,384 కోట్లతో హఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా టైర్ల ఉత్పత్తిని పరిశీలించిన ఏటీసీ నేటి నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించింది.. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ…
విశాఖ గురించి ఏ మాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా ఇక్కడ నీలి సముద్రం అందాలు సుపరి చితం. 35కిలోమీటర్ల తీరంలో బంగారపు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. వాటిని బలంగా తాకే అలలు కనిపిస్తాయి. కానీ, రెండు రోజులుగా ఇక్కడ సముద్రం కొంత మేర రంగు మారింది. నల్లటి ఇసుక మేటలు వేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ మధ్య తీరం నల్లగా మారడం తో సందర్శకులు అందోళనకు గురైయ్యారు.. నల్లటి ఇసుక కొట్టుకుని రావడం…