GVL Narasimha Rao: విశాఖ, ఇతర నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని కేంద్ర మంత్రికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 5G సేవల కోసం విశాఖపట్నం యొక్క వ్యూహాత్మక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను లేఖలో వివరించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి రాసిన లేఖలో, దేశంలోని 13 నగరాల్లో 5G సేవలను ప్రారంభించడం ద్వారా కొత్త డిజిటల్ యుగానికి నాంది పలికినందుకు వారికి మరియు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలియ చేశారు.
Read Also: Hyderabad: హైదరాబాద్లో ఉగ్ర కుట్ర.. ఆరుచోట్ల పేలుళ్లకు ప్లాన్
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ యొక్క 5G టెక్నాలజీ డిజిటల్ మరియు ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు జీవీఎల్. తదుపరి దశలోని నగరాల్లో ముఖ్యమైన విశాఖపట్నం మరియు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో 5G సేవలను ప్రారంభించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. అతి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి 5G సేవలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఎంపీ జీవీఎల్ నొక్కిచెప్పారు. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన ఆర్థిక వృద్ధిని కలుగ చేసే ఇంజిన్ వంటిదని ఎంపి తెలియచేశారు.
దీంతో పాటు విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి స్థావరంగా ఉన్నందున, విశాఖపట్నం పోర్ట్, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, సమీర్ మొదలైన ఇతర వ్యూహాత్మక సంస్థలతో పాటు ప్రధాన భారతీయ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలను కలిగి ఉన్నందున విశాఖపట్నం జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక మరియు ముఖ్యమైన ప్రాంతమని ఎంపీ జీవిఎల్ అన్నారు. ఆర్థిక, వ్యూహాత్మక మరియు భద్రతా కారణాల దృష్ట్యా 5G సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రాజ్యసభ ఎంపీ జీవీఎల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను లేఖలో అభ్యర్థించారు.
Read Also: Chelluboyina Venugopal: భవిష్యత్ తరాలకు మేలు జరగాలి
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!