GVL Narasimha Rao: విశాఖ, ఇతర నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని కేంద్ర మంత్రికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 5G సేవల కోసం విశాఖపట్నం యొక్క వ్యూహాత్మక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను లేఖలో వివరించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి రాసిన లేఖలో, దేశంలోని 13 నగరాల్లో 5G సేవలను ప్రారంభించడం ద్వారా కొత్త డిజిటల్ యుగానికి నాంది పలికినందుకు వారికి మరియు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలియ చేశారు.
Read Also: Hyderabad: హైదరాబాద్లో ఉగ్ర కుట్ర.. ఆరుచోట్ల పేలుళ్లకు ప్లాన్
Also Read
అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ యొక్క 5G టెక్నాలజీ డిజిటల్ మరియు ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు జీవీఎల్. తదుపరి దశలోని నగరాల్లో ముఖ్యమైన విశాఖపట్నం మరియు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో 5G సేవలను ప్రారంభించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. అతి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి 5G సేవలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఎంపీ జీవీఎల్ నొక్కిచెప్పారు. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన ఆర్థిక వృద్ధిని కలుగ చేసే ఇంజిన్ వంటిదని ఎంపి తెలియచేశారు.
దీంతో పాటు విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి స్థావరంగా ఉన్నందున, విశాఖపట్నం పోర్ట్, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, సమీర్ మొదలైన ఇతర వ్యూహాత్మక సంస్థలతో పాటు ప్రధాన భారతీయ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలను కలిగి ఉన్నందున విశాఖపట్నం జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక మరియు ముఖ్యమైన ప్రాంతమని ఎంపీ జీవిఎల్ అన్నారు. ఆర్థిక, వ్యూహాత్మక మరియు భద్రతా కారణాల దృష్ట్యా 5G సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రాజ్యసభ ఎంపీ జీవీఎల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను లేఖలో అభ్యర్థించారు.
Read Also: Chelluboyina Venugopal: భవిష్యత్ తరాలకు మేలు జరగాలి
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!