GVL Narasimha Rao: విశాఖ, ఇతర నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించాలి
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని కేంద్ర మంత్రికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 5G సేవల కోసం విశాఖపట్నం యొక్క వ్యూహాత్మక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను లేఖలో వివరించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి రాసిన లేఖలో, దేశంలోని 13 నగరాల్లో 5G సేవలను ప్రారంభించడం ద్వారా కొత్త డిజిటల్ యుగానికి నాంది పలికినందుకు వారికి మరియు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలియ చేశారు.
Read Also: Hyderabad: హైదరాబాద్లో ఉగ్ర కుట్ర.. ఆరుచోట్ల పేలుళ్లకు ప్లాన్
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ యొక్క 5G టెక్నాలజీ డిజిటల్ మరియు ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు జీవీఎల్. తదుపరి దశలోని నగరాల్లో ముఖ్యమైన విశాఖపట్నం మరియు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో 5G సేవలను ప్రారంభించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. అతి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి 5G సేవలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఎంపీ జీవీఎల్ నొక్కిచెప్పారు. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన ఆర్థిక వృద్ధిని కలుగ చేసే ఇంజిన్ వంటిదని ఎంపి తెలియచేశారు.
దీంతో పాటు విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి స్థావరంగా ఉన్నందున, విశాఖపట్నం పోర్ట్, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, సమీర్ మొదలైన ఇతర వ్యూహాత్మక సంస్థలతో పాటు ప్రధాన భారతీయ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలను కలిగి ఉన్నందున విశాఖపట్నం జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక మరియు ముఖ్యమైన ప్రాంతమని ఎంపీ జీవిఎల్ అన్నారు. ఆర్థిక, వ్యూహాత్మక మరియు భద్రతా కారణాల దృష్ట్యా 5G సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రాజ్యసభ ఎంపీ జీవీఎల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను లేఖలో అభ్యర్థించారు.
Read Also: Chelluboyina Venugopal: భవిష్యత్ తరాలకు మేలు జరగాలి
తాజావార్తలు
-
Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్తో అదిరిపోయే బైక్
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!