Adimulapu Suresh: క్లీన్ మునిసిపాలిటీగా విజయవాడ.. క్లీన్ బిగ్ సిటీగా వైజాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“స్వచ్ఛ అమృత మహోత్సవ్” లో భాగంగా ఏపీకి “స్వచ్ఛ సర్వేక్షణ” అవార్డులు ఏపీకి 11 “స్వచ్ఛ సర్వేక్షణ” అవార్డులు లభించాయన్నారు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రపతి చేతుల మీదుగా “స్వచ్ఛ సర్వేక్షన్” అవార్డులు అందుకున్నారు మంత్రి ఆదిమూలుపు సురేష్,పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు. “స్వచ్ఛ సర్వేక్షన్” అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి సురేష్. స్థానిక యంత్రాంగం, అధికారులు,అన్ని వ్యవస్థల కృషితోనే అవార్డులు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రానికి కేంద్ర స్వచ్ఛ అవార్డులు వచ్చాయి.
తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు “సఫాయి మిత్ర” మున్సిపల్ కార్పొరేషన్ కింద మొదటి ర్యాంక్ వచ్చింది. క్లీన్ మున్సిపాలిటీగా విజయవాడ, “క్లీన్ బిగ్ సిటీ” గా విశాఖపట్నం అవార్డు అందుకుంది. పులివెందులకు “బెస్ట్ ఇన్నోవేషన్” అవార్డు, పుంగనూరుకు “బెస్ట్ సిటిజన్ ఫీడ్ బ్యాక్” అవార్డు వచ్చింది. విశాఖపట్నం “టాప్ ఇంపాక్ట్ క్రియేటర్” గా అవార్డు వచ్చింది, శ్రీకాకుళం మున్సిపాలిటికి రెండు అవార్డులు వచ్చాయన్నారు. “గార్బేజ్ ఫ్రీ సిటీ” (చెత్త రహిత పట్టణం) గా విశాఖ, తిరుపతి, విజయవాడకు “ఫైవ్ స్టార్ సిటీ” అవార్డులు వచ్చాయన్నారు మంత్రి సురేష్.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
Read Also: Sunil Deodhar: నరేంద్రమోడీ పథకాలకు.. జగన్ స్టిక్కర్లా?
దేశంలో “ఆల్ ఇండియా టాప్ టెన్” నగరాల్లో మూడు నగరాలు విశాఖ,తిరుపతి,విజయవాడ ఉన్నాయి. టాప్ 100 లో 7 సిటీలు ఉన్నాయి. ఈ జాబితాలో కర్నూలు, తిరుపతి, నెల్లూరు, కడప, రాజమండ్రి,జివిఎంసి, ఎంవిఎంసి ఉన్నాయని మంత్రి వివరించారు. క్లీన్ ఏపీలో భాగంగా గడిచిన మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా “బెస్ట్ ప్రాక్టిసెస్” కింద కేంద్రం అవార్డులు ఇచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంది.
పట్టణీకరణ ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు. ఏపీలో “అర్బన్ డెవలప్మేంట్ అథారిటీస్” పెంచాం అన్నారు మంత్రి సురేష్. పట్టణాలలో చెత్తను ప్రత్యామ్నాయ వనరుల ఏర్పాటుకు ఉపయోగిస్తున్నాం. “ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ “ , మురుగు నీటి శుద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. “క్లీన్ ఏపీ” కార్యక్రమంపై నిఘా పెడుతున్నాం. “రియల్ టైమ్ మానిటరింగ్” చేస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాలను “స్మార్ట్ సిటీస్” గా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం అన్నారు మంత్రి సురేష్.
Read Also: YS Sharmila: సీఎం కేసీఆర్కు సవాల్.. ముక్కు నేలకి రాసి నేనే ఇంటికెళ్లిపోతా
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!