Adimulapu Suresh: క్లీన్ మునిసిపాలిటీగా విజయవాడ.. క్లీన్ బిగ్ సిటీగా వైజాగ్
“స్వచ్ఛ అమృత మహోత్సవ్” లో భాగంగా ఏపీకి “స్వచ్ఛ సర్వేక్షణ” అవార్డులు ఏపీకి 11 “స్వచ్ఛ సర్వేక్షణ” అవార్డులు లభించాయన్నారు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రపతి చేతుల మీదుగా “స్వచ్ఛ సర్వేక్షన్” అవార్డులు అందుకున్నారు మంత్రి ఆదిమూలుపు సురేష్,పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు. “స్వచ్ఛ సర్వేక్షన్” అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి సురేష్. స్థానిక యంత్రాంగం, అధికారులు,అన్ని వ్యవస్థల కృషితోనే అవార్డులు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రానికి కేంద్ర స్వచ్ఛ అవార్డులు వచ్చాయి.
తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు “సఫాయి మిత్ర” మున్సిపల్ కార్పొరేషన్ కింద మొదటి ర్యాంక్ వచ్చింది. క్లీన్ మున్సిపాలిటీగా విజయవాడ, “క్లీన్ బిగ్ సిటీ” గా విశాఖపట్నం అవార్డు అందుకుంది. పులివెందులకు “బెస్ట్ ఇన్నోవేషన్” అవార్డు, పుంగనూరుకు “బెస్ట్ సిటిజన్ ఫీడ్ బ్యాక్” అవార్డు వచ్చింది. విశాఖపట్నం “టాప్ ఇంపాక్ట్ క్రియేటర్” గా అవార్డు వచ్చింది, శ్రీకాకుళం మున్సిపాలిటికి రెండు అవార్డులు వచ్చాయన్నారు. “గార్బేజ్ ఫ్రీ సిటీ” (చెత్త రహిత పట్టణం) గా విశాఖ, తిరుపతి, విజయవాడకు “ఫైవ్ స్టార్ సిటీ” అవార్డులు వచ్చాయన్నారు మంత్రి సురేష్.
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
Read Also: Sunil Deodhar: నరేంద్రమోడీ పథకాలకు.. జగన్ స్టిక్కర్లా?
దేశంలో “ఆల్ ఇండియా టాప్ టెన్” నగరాల్లో మూడు నగరాలు విశాఖ,తిరుపతి,విజయవాడ ఉన్నాయి. టాప్ 100 లో 7 సిటీలు ఉన్నాయి. ఈ జాబితాలో కర్నూలు, తిరుపతి, నెల్లూరు, కడప, రాజమండ్రి,జివిఎంసి, ఎంవిఎంసి ఉన్నాయని మంత్రి వివరించారు. క్లీన్ ఏపీలో భాగంగా గడిచిన మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా “బెస్ట్ ప్రాక్టిసెస్” కింద కేంద్రం అవార్డులు ఇచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంది.
పట్టణీకరణ ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు. ఏపీలో “అర్బన్ డెవలప్మేంట్ అథారిటీస్” పెంచాం అన్నారు మంత్రి సురేష్. పట్టణాలలో చెత్తను ప్రత్యామ్నాయ వనరుల ఏర్పాటుకు ఉపయోగిస్తున్నాం. “ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ “ , మురుగు నీటి శుద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. “క్లీన్ ఏపీ” కార్యక్రమంపై నిఘా పెడుతున్నాం. “రియల్ టైమ్ మానిటరింగ్” చేస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాలను “స్మార్ట్ సిటీస్” గా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం అన్నారు మంత్రి సురేష్.
Read Also: YS Sharmila: సీఎం కేసీఆర్కు సవాల్.. ముక్కు నేలకి రాసి నేనే ఇంటికెళ్లిపోతా
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!