విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాచలం గిరి ప్రదక్షిణను దేవస్థానం శాస్త్రోక్తం ప్రారంభించింది. వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి పూల రథాన్ని జెండా ఊపి ఆలయ అనువంశిక ధర్మకర్త, చైర్మన్ అశోక్ గజపతి రాజు ప్రారంభించారు.
విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లిలోని రాంబిల్లిలో ప్రేమపేరుతో బాలికను చిత్రవధ చేసి హత్య చేసి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటనను మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి కత్తిదూశాడు.