Residential Property: విశాఖ, విజయవాడ సహా ఈ నగరాల్లో ఇళ్లకు ఫుల్ డిమాండ్.. 94 శాతం పెరిగిన ధరలు..!
- భారతదేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పెరిగిన డిమాండ్..
- 94 శాతం వరకు పెరిగిన ధరలు..
- ఇళ్లు.. ఫ్లాట్లకు అధిక గిరాకీయే కారణం..! ఉద్యోగ మార్కెట్
- బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇళ్లకు గిరాకీ..
- స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ఈక్విటీ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Residential Property: ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు.. అంటే.. మనిషి జీవితంలో ఈ రెండింటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.. అంతేకాదు.. ఇల్లు కట్టడం, పెళ్లి చేయటం రెండూ ఖర్చుతో కూడుకున్నవే.. అనుకున్నదానికంటే ఒకటికి మూడింతలు ఖర్చు అవుతుంది.. మరోవైపు గృహమే కదా స్వర్గసీమ అని కూడా అన్నారు.. అయితే, తమ ఆర్థిక స్థోమతు బట్టి.. ఇళ్లను తమకు నచ్చిన విధంగా నిర్మించుకోవడం.. ఒకటైతే.. ఇప్పుడు కట్టిన ఇళ్లను కొనుగోలు చేయడం బాగా పెరిగిపోయింది.. బ్యాంకులు హౌసింగ్ లోన్లు ఇస్తుండంతో.. క్రమంగా ఇళ్లు కొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. 2023-24తో ముగిసే గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 94 శాతం వరకు పెరిగాయి.. నివాసాలకు అధిక గిరాకీయే ఇందుకు కారణమని.. ఉద్యోగ మార్కెట్ మరియు బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇళ్లకు మంచి గిరాకీ పెరిగిందని స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ఈక్విటీ పేర్కొంది.
Read Also: Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్
Also Read
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
- Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్... కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
- QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
ఆ సంస్థ.. 2023-24లో సగటు ఇళ్ల ప్రాజెక్టుల ప్రారంభ ధరను.. 2019-20 ధరలతో పోల్చి ఈ వివరాలను ప్రకటించింది. దేశంలో ప్రధానమైన 30 ద్వితీయశ్రేణి మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు ఉండగా.. అమృత్సర్, మొహలి, లుధియానా, చండీగఢ్, పానీపట్, దెహ్రాడూన్, భివాండీ, సోనేపట్, జయపూర్, ఆగ్రా, లఖ్నవూ, భోపాల్, ఇందౌర్, మంగళూరు, మైసూర్, కోయంబత్తూర్, కోచి, త్రివేండ్రం, రాయపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా, సూరత్, నాసిక్, నాగ్పూర్, గోవా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.. ఇందులో 24 నగరాల్లో ఇళ్ల ధరలు రెండంకెల్లో పెరిగిపోతే.. 6 నగరాల్లో ధరలు ఒక అంకె వృద్ధి సాధించాయని పేర్కొంది.. ఇక, టాప్ 10 సిటీల్లో ఇళ్ల ధరలు 54 శాతం నుంచి 94 శాతం పెరిగాయని పేర్కొంది ప్రాప్ఈక్విటీ.
గోవాలో 90 శాతం, మంగళూరులో 56 శాతం మరియు ఇండోర్ లో 72 శాతం వరుసగా వెస్ట్, సౌత్ మరియు సెంట్రల్/ఈస్ట్ జోన్లలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసినట్టు ఆ సంస్థ తెలిపింది.. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కొత్త లాంచ్ల కంటే పాత వాటికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. పెరిగిన డిమాండ్ కారణంగా ద్వితీయ శ్రేణి నగరాలు గణనీయమైన ధరల పెరుగుదలను చూశాయి. వినియోగదారుల్లో ఆసక్తి పెరగడం, కనెక్టివిటీలో ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు బలమైన జాబ్ మార్కెట్లు.. ఈ నగరాల్లో ఎక్కువ భాగం ధరలను రెండంకెలకు పెంచాయి అంటున్నారు ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు మరియు సీఈవో సమీర్ జసుజా..
తాజావార్తలు
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!