విశాఖపట్నం కేజీహెచ్లో ఓ మిరాకిల్ చోటు చేసుకుంది. చనిపోయిన శిశువులో కొన్ని గంటల తర్వాత చలనం వచ్చింది. వెంటనే పిల్లల విభాగంలోని ఎన్ఐసీయూ (నియోనెటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కు తరలించిన డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దాంతో చనిపోయాడనుకుని తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ శిశువు తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాల ప్రకారం… విశాఖపట్నం నగరానికి చెందిన ఓ గర్భిణీ పురుటి నొప్పులతో శుక్రవారం రాత్రి 9 గంటల…
విశాఖ నగరంలో గంజాయి పంట కలకలం రేపింది.. కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పండిస్తున్నారు కొంతమంది యువకులు.. గత రెండేళ్లుగా గంజాయి పండిస్తు మత్తుకు బానిసలుగా మారారు.. ఏజెన్సీ నుండి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.. గంజాయి సేవించి మిగిలిన వాటిని నగరంలో స్టూడెంట్స్ కి విక్రయిస్తున్నారు గంజాయి గ్యాంగ్.. పక్కా సమాచారంతో గుట్టురట్టు చేశారు విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు.
విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమం 1300రోజులు దాటింది. ఐక్య కార్యాచరణ సమితి దశలవారీగా పోరాటాన్ని విస్తరిస్తోంది. మరోవైపు, రాజకీయ పక్షాలకు ఈ వ్యవహారం సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉక్కు పరిరక్షణలో ఎవరి భాగస్వామ్యం ఎంత..? అనే చర్చ ప్రజల ముందుకు వస్తోంది. అదే సమయంలో ఉక్కు మంత్రిత్వశాఖ నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ మిల్లెట్స్ ఉపయోగించి ట్రంప్ చిత్రపటాన్ని తయారు చేశారు. అమెరికా అధ్యక్షునిగా రెండో పర్యాయం ఎన్నికైన సందర్భంగా చిరుధాన్యాలను ఉపయోగించి ఎంతో సహజసిద్ధంగా ఈ చిత్రాన్ని తయారు చేశారు.
రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ ఒక సీఎం విలాసం…
సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన ఆసక్తిని రేపుతోంది. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం నేరుకు రుషికొండకు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విజయనగరం షెడ్యుల్ రద్దు అయ్యింది. దీంతో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం అనకాపల్లి జిల్లాకు మారింది. శ్రీకాకుళం నుంచి నేరుగా పరవాడ ఫార్మా సిటీలోని లారస్ ఫార్మా కంపెనీ అడ్మిన్ బిల్డింగ్ కు చంద్రబాబు చేరుకుంటారు.
పగలు, పట్టింపులు, శత్రుశ్వాలు పక్కనబెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. VMRDA ఎరీనలో ప్రధాన మంత్రి రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు బండి సంజయ్.
విశాఖకు వెళ్లిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాగా.. అప్పటికే విమానం విశాఖకు బయలుదేరింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో విమానం విశాఖలో ల్యాండింగ్ అయిన తర్వాత అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత సమాచారం లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.