Vizag Crime: విశాఖలో దారుణం.. లా స్టూడెంట్పై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి..!
- విశాఖలో దారుణం..
- లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం..
- వీడియోలు తీసి బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: ఆడ పిల్ల కనిపించిందంటే చాలు.. కామంతో కళ్లుమూసుకుపోయి కామంధులు రెచ్చిపోతున్నారు.. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు.. బాలికలు, అమ్మాయిలు, మహిళలు.. వృద్ధులు.. ఇలా తిరిగి సురక్షితంగా ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యుల్లో టెన్షన్ ఉంటుంది.. దేశవ్యాప్తంగా పలు అత్యాచారా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్లో వరుసగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతుండగా.. తాజాగా విశాఖపట్నంలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది..
Read Also: Emotional Scene: కంటతడి పెట్టించే సన్నివేశం.. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుళ్లు..
Also Read
న్యాయం అందకుండా అన్యాయానికి గురవుతున్న ఎంతో మందికి న్యాయసాయం చేయాలన్న ఉద్దేశంతో లా చదువుతోన్న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.. బాధితురాలని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు.. అయితే, పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలు మధురవాడలోని NVP లా కాలేజీలో లా థర్డ్ ఇయర్ చదువుతోంది.. ఆమె సహచరి విద్యార్థి అయిన వంశీతో స్నేహం చేసింది.. అయితే, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ.. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకుని వెళ్లాడు.. అక్కడే విద్యార్థిని ఎంత వారించినా వినకుండా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు..
ఇక, మళ్లీ అదే నెల 13వ తేదీన డాబాగార్డెన్ లో ఉంటున్న తన ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కూడా అక్కడికి వచ్చి ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఇక, ఆ దృశ్యాలు తమ ఫోన్లలో చిత్రీకరించి.. బెదిరిస్తూ.. మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడి.. తమ పశువాంఛ తీర్చుకున్నారు.. అయితే, 2 నెలల తర్వాత మళ్లీ ఆనంద్, రాజేష్, జగదీష్.. బాధితురాలికి ఫోన్ చేసి.. తమ వద్దకు రావాలని కోరిన తీర్చాలని బెదిరించారు.. లేకపోతే పాత వీడియోలు బయటపెడతామంటూ భయపెట్టారు.. దీంతో, ఈ విషయం వంశీకి దృష్టికి తీసుకెళ్లింది బాధితురాలు.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేసిన వంశీ కూడా వారి కోరిక తీర్చాలంటూ మానసికంగా వేధించసాగాడు.. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఈ నెల 18వ తేదీన ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది బాధితురాలు.. ఇది గమనించిన బాధితురాలి తండ్రి అడ్డుకుని.. ఏం జరిగిందని నిలదీయడంతో.. అసలు విషయం బయటపెట్టింది.. దీంతో.. విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!