తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన చుట్టూ ఉన్నవారికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అని ముందుంటారు. మొన్నామధ్య ముడిమ్యాల క్యాసారం గేట్ల మధ్య ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదే సమయంలో వికారాబాద్ పర్యటన ముగించుకుని మొయినాబాద్ వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద స్థలం వద్ద తన కాన్వాయ్ అపి క్షతగ్రాతులను ప్రత్యేక వాహనంలో తరలించారు. అంతేకాకుండా ఆ తరువాత ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి యోగక్షేమాలపై ఆరా…
సింహం.. అడవికి రాజు. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా పరుగులు పెడుతుంది. జింకల్లాంటివి అయితే బతుకు జీవుడా అంటూ దొరక్కుండా పారిపోతాయి. కానీ చిన్న జంతువులు సింహం జోలికి రావు. కానీ ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు చుక్కలు చూపించింది. బాగా ఆటపట్టించిన తీరు నెటిజన్లను ఫిదా చేసింది. Read Also: Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల…
ముస్లింలకు ఎంత పవిత్రమైన మాసం రంజాన్ నెల. ఈ రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్దలతో అల్లాహ్ను ప్రార్థిస్తుంటారు. అయితే రంజాన్ వచ్చిదంటే చాలు.. పట్టణాల నుంచి గ్రామాల వరకు వివిధ రకాల వంటకాలు దర్శనమిస్తుంటుయి. ఇది హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పత్తర్కా ఘోష్ లాంటి ఎన్నో అరుదైన వంటకాలను ఈ రంజాన్ మాసంలో టేస్ట్ చేయవచ్చు. అయితే రంజాన్ నెలలో కేవలం ముస్లింలే కాకుండా మాంసాహార ప్రియులందరూ ఈ వంటకాలను ఆస్వాదిస్తుంటారు. ఎన్ని వంటకాలు…
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను అధికారులు భద్రపరచారు. వారిలో ఒకరిని బంధువు గుర్తించడంతో మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ షాక్కు గురయ్యారు. ఓజీహెచ్ మార్చురీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు కేసుల్లో మృతదేహాలను మైలార్దేవ్పల్లి, ఎస్ఆర్నగర్ పోలీసులు మార్చురీకి తీసుకొచ్చి గుర్తింపు కోసం ఉంచారు. అయితే గురువారం ఓ బంధువు వచ్చి ఒక మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు మృతదేహాన్ని కుటుంబ…
నంద్యాల జిల్లాలో జగన్ వసతి దీవెన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై బీజేపీ భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. వారిని ఉద్దేశించి వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అనడం బాధాకరం అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరం. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకు? జగన్…
1.టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నిజానికి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇలా బాలయ్య పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచి వేస్తోంది. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉంటున్న బాలయ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు. https://ntvtelugu.com/veteran-actor-balayya-passes-away-at-94/ 2.దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు…
సాధారణంగా మనం వంటల్లో ఎర్రకారంపొడిని వాడుతుంటాం. అయితే ఇకపై పచ్చకారంపొడి కూడా అందుబాటులోకి రానుంది. యూపీలోని వారణాసికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ పచ్చిమిర్చి పొడిని తయారుచేసే సాంకేతికతను అభివృద్ధి చేసింది. త్వరలోనే పచ్చ కారంపొడిని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఈ కొత్త ఆకుపచ్చని కారానికి సంబంధించిన సాంకేతికతకు IIVR పేటెంట్ హక్కులను కూడా పొందింది. ఆకుపచ్చ కారంపొడిని ఎలా తయారుచేస్తారంటే… తొలుత పచ్చిమిరపకాయలను ప్రత్యేక పద్ధతుల్లో రంగు పోకుండా ఎండబెట్టి కారంపొడి…
నదిలో పడ్డ వ్యక్తిని కాపాడిన పోలీస్.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు.. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తుంటాం. కోవిడ్ టైంలో అయితే ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేసి ప్రజల్ని రక్షించారు. ఆపదలో ఎవరు వున్నా.. విధి నిర్వహణలో వున్న పోలీసులు తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. ఫ్రెండ్లీ పోలీసులు అనిపించుకుంటూ వుంటారు. గుంటూరు పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. https://ntvtelugu.com/tamilnadu-former-built-a-temple-for-his-pet-dog/ ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు అరండల్ పేట…
పెంపుడు జంతువుల్లో కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. అందుకే చాలా మంది కుక్కలను ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఇటీవల కుక్కలు చనిపోయినా తట్టుకోలేని వాళ్లు వాటి మీద ప్రేమతో అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ రైతు కుక్క కోసం గుడి కట్టేశాడు. ఇప్పటివరకు తమిళనాడులో హీరోయిన్లకు గుడి కట్టిన వాళ్ల గురించే విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు కుక్క కోసం గుడి కట్టడం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది కదూ. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని శివగంగ…
1.ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక…