Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ntv Topnews Today April 09 2022

Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

Published Date :April 9, 2022 , 4:44 pm
By NTV WebDesk
Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

1.టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నిజానికి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇలా బాలయ్య పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచి వేస్తోంది. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉంటున్న బాలయ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

https://ntvtelugu.com/veteran-actor-balayya-passes-away-at-94/

2.దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని లెక్కించి ఆ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచించింది. అందులో తొలివిడత నిధులను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

https://ntvtelugu.com/central-government-released-879-crores-funds-to-ap-under-revenue-deficit-grant/

3.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ల మధ్య గట్టి పోటీ ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఉన్న కథను బట్టి ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఒకే రోజు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్దపడుతున్నారు మేకర్స్.. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాకే ఎక్కడలేని చిక్కులు వచ్చాయా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే యశోద సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకుంది. ఆగస్టు 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు అఖిల్ ..

4. తెలంగాణలో ఒక్క జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు ఎక్కువగా వుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తార స్థాయికి చేరింది. ఏకంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై దాడికి స్వపక్షీయులే దాడి చేయడానికి ప్రయత్నించారు. మోటార్ బైక్ ను డీ కొట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి కోసం ఎదురు చూసిన చైర్ పర్సన్ ఏకంగా రోడ్డెక్కి బైఠాయించింది. దీంతో కొత్తగూడెంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

5.ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ తరహా ఘటనలు అడుగడుగునా జరుగుతున్నాయి. కర్ణాటకలో ఓ బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. బాలికపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో కిమ్మనకుండా ఉండిపోయింది.

6.మహబూబ్ నగర్ జిల్లాలో కిసాన్ మోర్చా నిర్వహించిన రైతు సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగ వంద తప్పులు చేసింది. ప్రజలు టీఆర్ఎస్‌ను శిక్షించి నన్ను గెలిపించారని, 101వ తప్పుకు కూడా ప్రజలు శిక్షిస్తారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బుకు, సంపదకు కాపలాదారులు మాత్రమేనని, ప్రధాని నరేంద్ర మోడీ హూందాగా తన కర్తవ్యమని చెబుతారని, కేసీఆర్ నేనిచ్చానని చెప్పుతారన్నారు. గజ్వేల్‌లోని ఆయన సొంత భూములు అమ్మి ఇస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
7.గ్రామాల్లో కరెంట్ పీకుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను.. సీఎం పదవి నుంచి పీకేందుకు జనం సిద్ధంగా ఉన్నారంటూ వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పిలుపునిచ్చిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.. బాదుడే బాదుడు ఆందోళనల్లో భాగంగా త్వరలో క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టబోతున్నారు చంద్రబాబు, లోకేష్.. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసిన చంద్రబాబు.. ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని కార్యక్రమంపై జరిపిన సమీక్షలో వ్యాఖ్యానించారు.
8.ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తనదైన రీతిలో చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తోంది. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆమె కొంతమంది లా విద్యార్థులతో కలిసి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చేనేతకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చర్చించారు. ఇక పూనమ్ కౌర్ తో పాటు పలువురు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందంటూ శశి థరూర్ భేటీకి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు. “చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తున్న న్యాయ విద్యార్థుల బృందాన్ని, పూనమ్‌ కౌర్‌ను కలవడం సంతోషంగా ఉంది. వారి డిమాండ్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను. పరిశ్రమ సంక్షోభంలో ఉంది. చేనేత కార్మికులు చాలా కష్టపడతారు. పైగా జీఎస్టీ వల్ల ఖర్చు పెరిగి వారిపై అదనపు భారం పడుతోంది” అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు.
9.ప్రస్తుతం శ్రీలంకలో రావణ కాష్టంలా రగిలిపోతోంది. ఆ దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ప్రజలంతా కలిసి ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రధాని రాజపక్సే ఇంటి వద్ద ప్రజలు తీవ్ర దాడులకు పాల్పుడుతున్నారు. దీంతో రాజపక్సే ప్రాణాలకు ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రధాని పదవి రాజీనామా చేయాలని అల్టీమేటం కూడా వస్తోంది. దీంతో ప్రధాని రాజపక్సే విదేశాలకు పారిపోయే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
10.తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గవర్నర్‌ తమిళిసై చుట్టూ తిరుగుతున్నాయి.. ప్రభుత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఇక, కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్‌ మాత్రం ఆమెను టార్గెట్‌ చేసి కౌంటర్‌ ఎటాక్ చేస్తోంది… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి… ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని ప్రశ్నించారు.. మేం వరి ధాన్యం మీద పోరాటం చేస్తున్నాం.. గవర్నర్ బాధ్యతతో మాట్లాడాలి, రాజకీయాలు అవసరం లేదని హితవు పలికిన ఆయన.. అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తలసాని.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • cinema news
  • ntv top news
  • NtvTelugu​
  • political news

తాజావార్తలు

  • JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

  • Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!

  • Couvade syndrome: మగాళ్లకు కూడా గర్భం.. సైంటిస్టులు తేల్చిన సంచలన నిజం!

  • Ugadi 2026-YS Jagan: ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు!

  • Yuzvendra Chahal: “మందు మానేశా.. ఈసారి 150% ఎఫర్ట్స్ పక్కా”.. ఐపీఎల్‌కు ముందు చాహల్ సంచలన ప్రకటన!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions