ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఓ మహిళ దీక్షకు దిగింది. తన భర్త దాంపత్య జీవితానికి పనికిరాడని.. ఈ విషయం తెలిసి కూడా తమ కుమారుడితో తనకు పెళ్లి చేసి అత్తామామలు జీవితాన్ని నాశనం చేశారంటూ మహిళ ఆందోళన చేపట్టింది. అత్తింటివారి వేధింపుల నుండి కాపాడి తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ పుట్టింటివారితో కలిసి ఆమె నిరాహార దీక్ష చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన పెళ్లి అయినప్పటి నుంచి తాను భర్తతో…
విజయవాడలో మరోసారి కలకలం రేగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పుల వాళ్లు బాకీలు ఇవ్వాలని పోరు పెడుతుండటంతో ఏం చేయాలో తెలియక వెంకటేశ్వరరావు కుటుంబం విజయవాడకు వచ్చి లాడ్జీలో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి…
ఆంధ్రా రాజకీయాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి తీరు హాట్ టాపిక్ అవుతుండేది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల సర్వేలతో ఆయన కాకరేపారు. ఆయన భాష్యాలు, సర్వేలు తప్పవడంతో ఆయన బొక్కబోర్లా పడ్డారు. తాజాగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు మాజీ ఎంపీ లగడపాటి. తాజాగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్తో లగడపాటి సమావేశం.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శని, ఆదివారాల్లో బిజీగా గడిపారు లగడపాటి. పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించడంతో…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార బాధితురాలి పరామర్శ ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.. పరామర్శ సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం రచ్చగా మారింది.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. బాధితురాలి దగ్గర టీడీపీ నేతలు బల ప్రదర్శన చేశారని ఎద్దేవా చేసిన ఆమె.. గొడవను కంట్రోల్ చేయమని అడిగితే నాపై విరుచుకుపడ్డారని…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం రచ్చగా మారింది. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, మహిళలకు రక్షణలో ప్రభుత్వ వైఫల్యాలను లేఖలో పేర్కొన్నారు.. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు..…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. బోండా ఉమ మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నారని.. బోండా ఉమ లాంటి ఆకు రౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమేనని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాధితులను ఎలా పరామర్శించాలో కూడా…
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. వేసవిలో ఎండల కారణంగా బ్యాటరీలు వేడెక్కి ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్నాయి. దీంతో ఆయా వాహనాల జోలికి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా విజయవాడలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. విజయవాడ సూర్యారావు పేటలోని గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 40 శాతం గాయాలు కావడంతో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. అయితే, విజయవాడ జీజీహెచ్ లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న ఆయన.. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు..…
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కు పాల్పడటం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నున్న పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు విధించారు. తమ కుమార్తె కనిపించలేదన్న బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం…
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వాంబే కాలనీ అమ్మాయిపై తన స్నేహితులతో కలిసి ప్రియుడు అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడితో పాటు అతడి ఇద్దరి స్నేహితులు కలిసి ఆస్పత్రిలోనే యువతిపై గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తన కుమార్తెపై విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎన్టీవీతో బాధితురాలి తల్లి వెల్లడించింది.…