విజయవాడలో నూతన న్యాయస్థాన భవనాలను సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు సీఎం జగన్ పాల్గొన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో G+7 భవనాలు నిర్మించారు. వీటిలో 29 ఏసీ కోర్టు హాళ్లు, న్యాయవాదులు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్, ఏడు లిఫ్టులు సహా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అత్యాధునిక సదుపాయాలతో ఈ నూతన భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముందు విజయవాడ చేరుకున్న సీజేఐ ఎన్వీ…
At Home in Raj Bhavan: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి హాజరయ్యారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. అంతేకాకుండా పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.…
Krishna Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నది శాంతించింది. దీంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11 అడుగులకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 9.7 లక్షలు, కాలువలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల…
Kesineni Nani : బెజవాడ ఎంపీ కేశినేని నాని.. టీడీపీలో ఎవరికి గురి పెట్టారు? సూతిమెత్తంగా ఎవరికి చురకలు వేశారు? ఇటీవల జరుగుతున్న పరిణామాలకు వాళ్లే కారణమనే ఫీలింగ్లో ఉన్నారా? ప్రైవేట్ సంభాషణల్లో నాని చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? టీడీపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? కేశినేని నాని. బెజవాడ టీడీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న ఎంపీ. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారానికి దూరమైన తర్వాత.. ఆయన కూడా…
ఎంతో కాలంగా నా పేరుతో నకిలీ కారు స్టిక్కర్ ను ఉపయోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎంపీ స్టిక్కర్ పేరుతో బెదిరింపులు, మోసాలకు పాల్పడుతున్నారని తన సోదరుడిపై ఆరోపణలు గుప్పించారు ఎంపీ కేశినేని నాని