CPI Narayana: మూడు రాజధానులు అనేది వైసీపీ సర్కారు ఉద్యమం మాత్రమే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 17 దేశాల ప్రతినిధులతో వామపక్ష పార్టీల బలోపేతంపై చర్చించామని తెలిపారు.
Read Also: Vidadala Rajini: జనసేన కార్యకర్తలు కావాలనే దాడి చేశారు.. ఎవరినీ వదిలిపెట్టం..!!
Also Read
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
అటు అమరావతి రాజధానిగా ఉండాలని, మోదీ ఆర్థిక విధానాలపై వ్యతిరేకంగా 24వ జాతీయ మహాసభల్లో తీర్మానాలు చేశామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలని టీడీపీ కంటే తాము ముందుగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఏపీకి ప్రస్తుతం రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని.. బిడ్డకు మూడేళ్లు వచ్చినా, తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అనేది సర్కార్ ఉద్యమం అన్నారు. అధికార పార్టీ నాయకులు భూదోపిడీదారులు అని నారాయణ తీవ్రంగా ఆరోపించారు. కాగా ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని.. అందుకే వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని చురకలు అంటించారు.
తాజావార్తలు
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!