Vijayawada: ఈనెల 25న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారని తెలిపారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
మరోవైపు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వీఐపీలకు పరిమితమైన అంతరాయల దర్శనం సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రోటోకాల్ ఉన్నవారికే అంతరాలయ దర్శనం కల్పించేవాళ్లమని.. ఇక నుంచి అందరికీ ఈ అవకాశం కల్పిస్తామన్నారు. అయితే గతంలో ప్రోటోకాల్ దర్శనం కోసం రూ.300 టిక్కెట్ ధర ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ టిక్కెట్ ధరను రూ. 500కి పెంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇకపై అంతరాలయ దర్శనం కోసం ప్రోటోకాల్ అవసరం లేదన్నారు. రూ.500 టిక్కెట్ ధరపై అంతరాలయ దర్శనంతో పాటు రెండు అమ్మవారి లడ్డూ ప్రసాదాలు, అర్చకుల ఆశీర్వచనం ఉంటాయని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!