Vijayawada: ఈనెల 25న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం మూసివేత
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారని తెలిపారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
మరోవైపు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వీఐపీలకు పరిమితమైన అంతరాయల దర్శనం సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రోటోకాల్ ఉన్నవారికే అంతరాలయ దర్శనం కల్పించేవాళ్లమని.. ఇక నుంచి అందరికీ ఈ అవకాశం కల్పిస్తామన్నారు. అయితే గతంలో ప్రోటోకాల్ దర్శనం కోసం రూ.300 టిక్కెట్ ధర ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ టిక్కెట్ ధరను రూ. 500కి పెంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇకపై అంతరాలయ దర్శనం కోసం ప్రోటోకాల్ అవసరం లేదన్నారు. రూ.500 టిక్కెట్ ధరపై అంతరాలయ దర్శనంతో పాటు రెండు అమ్మవారి లడ్డూ ప్రసాదాలు, అర్చకుల ఆశీర్వచనం ఉంటాయని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!