Pawan Kalyan and Somu Veerraju: జనసేనపై కుట్ర.. కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేనపై కుట్ర చేస్తున్నారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవవన్ కల్యాణ్ను నోవాటెల్ హోటల్లో కలిసిన ఆయన.. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు ఆ తర్వాత ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు ఇద్దరు నేతలు.. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో నిన్నటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవసరంలేదని అభిప్రాయపడ్డారు. విజయనగరంలో బీజేపీ కార్యకర్తలపై నుంచి వైసీపీ దాడి ప్రారంభమైందన్న పవన్.. ప్రతిపక్ష పార్టీలు నేతలపై దాడులతో భయ పెడుతున్నారు.. జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారు.. నిన్న ఘటన పూర్తిగా ప్రభుత్వం కుట్రగా భావిస్తున్నాం అన్నారు.
Read Also: Income Tax Raids: నెల్లూరులో ఐటీ దాడుల కలకలం..
Also Read
- Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
- Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
ఇక, సోము వీర్రాజు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశం అన్నారు. జనసేనాధిపతిగా అనేక కార్యక్రమాలు, పర్యటనలు చేపట్టారు.. వైసీపీవారు వారికి వారిగా ఒక ఉద్యమం చేస్తున్నారు.. వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేనపై కుట్ర చేశారు ఆరోపించారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామన్నారు సోమువీర్రాజు.. వారు కూడా వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని.. రాష్ట్ర ప్రభుత్వం దమన చర్యలపై పోరు ఉమ్మడిగా సాగిస్తాం అన్నారు.. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రాంగా విమర్శించిన సోము వీర్రాజు.. జన స్పందన లేక పోవడంతో కుట్రకు తెర లేపారు.. ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతాం అన్నారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అనేది ప్రచారం మాత్రమే అన్నారు సోము వీర్రాజు..
తాజావార్తలు
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
-
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
-
PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
-
Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!