Somu Veerraju: కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ పార్టీలను రాజకీయాల నుంచి తొలగించాలన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. విజయవాడలో రెండు రోజు బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, ఎమ్మెల్సీలు, పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ ఇంచార్జ్లు, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు విజయవాడకు కేంద్రంగా ఉండేవి. ఇవాళ దేశాన్ని కమ్యూనిస్టు పార్టీ భ్రష్టు పట్టిస్తున్నాయి. త్వరలో 175 నియోజకవర్గాల్లో స్థానిక నేతల పాదయాత్రలు ఉంటాయి. సీపీఐ పార్టీ వాళ్ళను వాళ్ళే తొలగించుకుంటున్నారు….మోడీని తొలగిస్తాం అంటున్నారు. మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. రోడ్డు పై డ్యాన్స్లు వేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో దేశంలో ఎక్కడా బీజేపీ పొత్తు పెట్టుకోలేదన్నారు.
Read Also: Nirmala Sitharaman: రూపాయి పడిపోవడం లేదు.. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
విశాఖలో అభివృద్ధి వికేంద్రీకరణపై ఆయన మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్కు నమ్మకం ఉంది కనుకే మండల కమిషన్ ఏర్పాటు చేశారు. వైసీపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో అసలు తెలుసా?? ఒకేసారి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది బీజేపీ. అభివృద్ధి వికేంద్రీకరణ పై వైసీపీ, టీడీపీలకు పాఠాలు చెప్పగలిగే పార్టీ రాష్ట్రంలో బీజేపీనే. చైనా రాజధాని బీజింగ్…కాని షాంఘైని అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి అంటే అది. విశాఖను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఈ అంశం పై చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు సోము వీర్రాజు.
హుద్ హుద్ తుఫాను అనంతం విశాఖను ఆదుకున్నామన్నారు. స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా…విశాఖ. ఇది గమనించింది నరేంద్ర మోడీ. విశాఖ అభివృద్ధికి జగన్ ఒక్క వంద కోట్లు అయినా ఖర్చు పెట్టారా? చంద్రబాబు 50 కోట్లు అయినా ఖర్చు పెట్టారా? కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా? బూమ్ బూమ్ మందులు అమ్ముకోవడం తప్ప అభివృద్ధి ఆలోచన మీకు ఎక్కడ ఉందని ఘాటుగా విమర్శించారు సోము వీర్రాజు.
మీరు వేసే రోడ్ల పై బళ్ళు పడిపోతాయి…మేం వేసే రోడ్ల పై జర్రున వెళతాయి. అభివృద్ధి మా పంతం, మీది రియల్ ఎస్టేట్ దందా. ల్యాండ్ మాఫియా మీ కండక్ట్…భూ దందా మీ కండక్ట్. అభివృద్ధిలో నరేంద్ర మోడీ హీరో…మీరంతా జీరోలు. డబ్బును ఎలా దోచుకోవటమా అనేది మీ విజన్. ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారు?? వైసీపీ, టీడీపీ అవినీతి 40 ఇష్టు 60. పోలవరం ఎప్పుడు ప్రారంభం అయ్యింది?? ఎవరు వేస్తే వారు తమ వాళ్ళను పెట్టుకునే ప్రయత్నం చేశారు. నాట్ రూలింగ్ ..ఓన్లీ ట్రేడింగ్. దసపల్లా భూములు చంద్రబాబు వర్గం, ఇప్పుడు వీళ్ళకు క్యాష్. మనం కూడా రాష్ట్రంలో సోషల్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకుని రానున్నాం. వచ్చే రోజుల్లో వాటర్ నుంచి హైడ్రోజన్ను తయారు చేస్తాం. విదేశాలకు విద్యుత్ అమ్ముతాం. ఇది మా విజన్ అన్నారు సోము వీర్రాజు.
Read Also: Nirmala Sitharaman: రూపాయి పడిపోవడం లేదు.. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది.
తాజావార్తలు
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..