Bhavani Devotees: భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. నవరాత్రులు ముగిసినా తగ్గని రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైభవంగా దేవి నవరాత్రులు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానిలా రద్దీ కొనసాగుతుంది… రాజరాజేశ్వరి రూపంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవటానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది… భవాని నామస్మరణతో దుర్గమ్మ కొండా మార్మోగుతుంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు… ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. నిన్నటితో దసరా ముగిసిన కొండపై భవానిలా రద్దీతో ఇంకా దసరా వాతావరణం కనిపిస్తుంది.. దూర ప్రాంతాల నుండి కాలినడకతో దుర్గమ్మను దర్శించుకోవటానికి భవాని భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దాంతో భవాని నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది.. అమ్మవారిని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవాని భక్తులు కాలి నడకన వస్తున్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడా భవానిలా దర్శనాలు ఆగలేదు.
Read Also: Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?
Also Read
ప్రతి ఏడాది దసరా వచ్చిందంటే చాలు చాల మంది అమ్మవారి భక్తులు నవరాత్రులు అయిపోయే వరకు అమ్మవారి మల ధరిస్తారు… కొంతమంది కార్తీక మాసంలో మాలలు దారిస్తే మరికొంత మంది దసరాలో భవాని మాల ధరిస్తారు.. వాళ్లలో చాల మంది ఇంద్రకీలాద్రి కిందే గురు భవానీలతో మల వేయించుకుని 9 రోజుల తర్వాత మళ్లీ అక్కడే మాల విరమణ చేసేస్తారు… అయితే, ఈ ఏడాది భవానీలు ఇంద్రకీలాద్రిపై ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు.. కనీసం హోమ గుండం అయినా ఏర్పాటు చెయ్యాలని కోరినప్పటికీ వైదిక కమిటీ నిర్ణయం మేరకు అది జరగలేదు… దాంతో చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి.. వారు ఎక్కడ మాల వేసుకున్నారో అక్కడే విరమణ కూడా చేసుకున్నారు. దసరా చివరి రోజు నిన్న, ఇవాళ ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల తాకిడి పెరగటంతో అక్కడి ఏర్పాట్లను కూడా అలానే ఉంచేశారు ఆలయాధికారులు… రేపు కూడా మరింత మంది భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..