Bhavani Devotees: భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. నవరాత్రులు ముగిసినా తగ్గని రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైభవంగా దేవి నవరాత్రులు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానిలా రద్దీ కొనసాగుతుంది… రాజరాజేశ్వరి రూపంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవటానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది… భవాని నామస్మరణతో దుర్గమ్మ కొండా మార్మోగుతుంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు… ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. నిన్నటితో దసరా ముగిసిన కొండపై భవానిలా రద్దీతో ఇంకా దసరా వాతావరణం కనిపిస్తుంది.. దూర ప్రాంతాల నుండి కాలినడకతో దుర్గమ్మను దర్శించుకోవటానికి భవాని భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దాంతో భవాని నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది.. అమ్మవారిని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవాని భక్తులు కాలి నడకన వస్తున్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడా భవానిలా దర్శనాలు ఆగలేదు.
Read Also: Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
ప్రతి ఏడాది దసరా వచ్చిందంటే చాలు చాల మంది అమ్మవారి భక్తులు నవరాత్రులు అయిపోయే వరకు అమ్మవారి మల ధరిస్తారు… కొంతమంది కార్తీక మాసంలో మాలలు దారిస్తే మరికొంత మంది దసరాలో భవాని మాల ధరిస్తారు.. వాళ్లలో చాల మంది ఇంద్రకీలాద్రి కిందే గురు భవానీలతో మల వేయించుకుని 9 రోజుల తర్వాత మళ్లీ అక్కడే మాల విరమణ చేసేస్తారు… అయితే, ఈ ఏడాది భవానీలు ఇంద్రకీలాద్రిపై ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు.. కనీసం హోమ గుండం అయినా ఏర్పాటు చెయ్యాలని కోరినప్పటికీ వైదిక కమిటీ నిర్ణయం మేరకు అది జరగలేదు… దాంతో చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి.. వారు ఎక్కడ మాల వేసుకున్నారో అక్కడే విరమణ కూడా చేసుకున్నారు. దసరా చివరి రోజు నిన్న, ఇవాళ ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల తాకిడి పెరగటంతో అక్కడి ఏర్పాట్లను కూడా అలానే ఉంచేశారు ఆలయాధికారులు… రేపు కూడా మరింత మంది భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!