Bhavani Devotees: భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. నవరాత్రులు ముగిసినా తగ్గని రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైభవంగా దేవి నవరాత్రులు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానిలా రద్దీ కొనసాగుతుంది… రాజరాజేశ్వరి రూపంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవటానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది… భవాని నామస్మరణతో దుర్గమ్మ కొండా మార్మోగుతుంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు… ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. నిన్నటితో దసరా ముగిసిన కొండపై భవానిలా రద్దీతో ఇంకా దసరా వాతావరణం కనిపిస్తుంది.. దూర ప్రాంతాల నుండి కాలినడకతో దుర్గమ్మను దర్శించుకోవటానికి భవాని భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దాంతో భవాని నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది.. అమ్మవారిని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవాని భక్తులు కాలి నడకన వస్తున్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడా భవానిలా దర్శనాలు ఆగలేదు.
Read Also: Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ప్రతి ఏడాది దసరా వచ్చిందంటే చాలు చాల మంది అమ్మవారి భక్తులు నవరాత్రులు అయిపోయే వరకు అమ్మవారి మల ధరిస్తారు… కొంతమంది కార్తీక మాసంలో మాలలు దారిస్తే మరికొంత మంది దసరాలో భవాని మాల ధరిస్తారు.. వాళ్లలో చాల మంది ఇంద్రకీలాద్రి కిందే గురు భవానీలతో మల వేయించుకుని 9 రోజుల తర్వాత మళ్లీ అక్కడే మాల విరమణ చేసేస్తారు… అయితే, ఈ ఏడాది భవానీలు ఇంద్రకీలాద్రిపై ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు.. కనీసం హోమ గుండం అయినా ఏర్పాటు చెయ్యాలని కోరినప్పటికీ వైదిక కమిటీ నిర్ణయం మేరకు అది జరగలేదు… దాంతో చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి.. వారు ఎక్కడ మాల వేసుకున్నారో అక్కడే విరమణ కూడా చేసుకున్నారు. దసరా చివరి రోజు నిన్న, ఇవాళ ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల తాకిడి పెరగటంతో అక్కడి ఏర్పాట్లను కూడా అలానే ఉంచేశారు ఆలయాధికారులు… రేపు కూడా మరింత మంది భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!