Bhavani Devotees: భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. నవరాత్రులు ముగిసినా తగ్గని రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైభవంగా దేవి నవరాత్రులు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానిలా రద్దీ కొనసాగుతుంది… రాజరాజేశ్వరి రూపంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవటానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది… భవాని నామస్మరణతో దుర్గమ్మ కొండా మార్మోగుతుంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు… ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. నిన్నటితో దసరా ముగిసిన కొండపై భవానిలా రద్దీతో ఇంకా దసరా వాతావరణం కనిపిస్తుంది.. దూర ప్రాంతాల నుండి కాలినడకతో దుర్గమ్మను దర్శించుకోవటానికి భవాని భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దాంతో భవాని నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది.. అమ్మవారిని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవాని భక్తులు కాలి నడకన వస్తున్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడా భవానిలా దర్శనాలు ఆగలేదు.
Read Also: Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ప్రతి ఏడాది దసరా వచ్చిందంటే చాలు చాల మంది అమ్మవారి భక్తులు నవరాత్రులు అయిపోయే వరకు అమ్మవారి మల ధరిస్తారు… కొంతమంది కార్తీక మాసంలో మాలలు దారిస్తే మరికొంత మంది దసరాలో భవాని మాల ధరిస్తారు.. వాళ్లలో చాల మంది ఇంద్రకీలాద్రి కిందే గురు భవానీలతో మల వేయించుకుని 9 రోజుల తర్వాత మళ్లీ అక్కడే మాల విరమణ చేసేస్తారు… అయితే, ఈ ఏడాది భవానీలు ఇంద్రకీలాద్రిపై ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు.. కనీసం హోమ గుండం అయినా ఏర్పాటు చెయ్యాలని కోరినప్పటికీ వైదిక కమిటీ నిర్ణయం మేరకు అది జరగలేదు… దాంతో చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి.. వారు ఎక్కడ మాల వేసుకున్నారో అక్కడే విరమణ కూడా చేసుకున్నారు. దసరా చివరి రోజు నిన్న, ఇవాళ ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల తాకిడి పెరగటంతో అక్కడి ఏర్పాట్లను కూడా అలానే ఉంచేశారు ఆలయాధికారులు… రేపు కూడా మరింత మంది భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!